Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో SBIలో ఖాళీలు.. 175 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2022 (16:21 IST)
ఎస్బీఐలో 1422 సర్కిల్‌ బేస్‌డ్‌ ఆఫీసర్ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన 175పోస్టులు ఖాళీలు వున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పసరిగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తు దారుల వయసు సెప్టెంబర్‌ 30,2022వ తేదీ నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 
 
ఈ అర్హతలున్నవారు ఎవరైనా నవంబర్‌ 7,2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.750లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.  ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష డిసెంబర్‌ 4,2022వ తేదీన నిర్వహిస్తారు. 
 
హాల్‌ టికెట్లను నవంబర్‌ నెలాఖరులో విడుదల చేస్తారు. ప్రతిభకనబరచిన అభ్యర్ధులకు నెలకు రూ.63,840లు జీతంగా చెల్లిస్తారు. మొత్తం 120 మార్కులకు, 120 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు ఆన్‌లైన్‌ విధానంలో 2 గంటల సమయంలో పరీక్ష జరుగుతుంది.  

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments