రైళ్లలో దోపిడీకి యత్నిస్తే కాల్చివేత: జీఆర్‌పీ, ఆర్పీఎఫ్‌ సమావేశంలో నిర్ణయం

రైళ్లలో దోపిడీకి యత్నించే దొంగలను కాల్చివేయాలని రైల్వే పోలీస్‌(జీఆర్‌పీ), రైల్వే రక్షక దళం(ఆర్పీఎఫ్‌) సంయుక్త సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రైళ్లలో రక్షణగా సాయుధ బలగాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయనున్నారు. రైళ్లలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నిరో

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (19:45 IST)
రైళ్లలో దోపిడీకి యత్నించే దొంగలను కాల్చివేయాలని రైల్వే పోలీస్‌(జీఆర్‌పీ), రైల్వే రక్షక దళం(ఆర్పీఎఫ్‌) సంయుక్త సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రైళ్లలో రక్షణగా సాయుధ బలగాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయనున్నారు. రైళ్లలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నిరోధం, ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా చర్యలు చేపట్టారు. 
 
కాచిగూడ రైల్వే స్టేషన్‌లోని ఆర్పీఎఫ్‌ స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో సికింద్రాబాద్‌ రైల్వే ఎస్పీ అశోక్‌కుమార్‌, దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్‌ సీనియర్‌ డివిజనల్‌ సెక్యూరిటీ కమిషనర్‌(డీఎస్సీ) సెంథిల్‌ కుమరేశన్‌ మాట్లాడారు. రాష్ట్రంలో రాత్రివేళల్లో రాకపోకలు సాగించే అన్ని ఎక్స్‌ప్రెస్‌, కొత్తగా ప్యాసింజర్‌ రైళ్లకు రక్షణగా సాయుధ బలగాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 
 
ఒక్కో రైలుకు ముగ్గురు సాయుధ సిబ్బందిని నియమించామని చెప్పారు. ఎక్కడైనా రైలులో దోపిడీకి యత్నించే దొంగలను సాయుధ సిబ్బంది కాల్చివేస్తారని హెచ్చరించారు. రైళ్లలో సాయుధ రక్షణ కోసం 40 మంది అదనపు సిబ్బందిని కొత్తగా నియమించినట్లు చెప్పారు. సిగ్నల్‌ టాంపరింగ్‌కు అవకాశమున్న ప్రాంతాల్లో రాత్రి పెట్రోలింగ్‌కు జీఆర్‌పీ, ఆర్పీఎఫ్‌ ఆధ్వర్యంలో సంయుక్త బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ బృందాలు అనుమానిత వ్యక్తుల కదలికలు, ముఠా సభ్యులపై నిఘా పెట్టి వారి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments