అమ్మవారి దర్శనం కోసం వెళ్లి వస్తూ అనంతలోకాలకు .. ఆటోను వెనుక నుంచి ఢీకొట్టిన కారు

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (13:13 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాలో ఓ కారు, ఆటోలు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో తొమ్మిది మంది గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ ప్రమాద వివరాలను పరిశీలిస్తే, కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన శశి భరత్ అనే వ్యక్తి కారును అతివేగంగా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆ సమయంలో కొమురవెల్లి దేవాలయం దర్శనం పూర్తిచేసుకుని గజ్వేల్ వైపు ఓ ఆటో వెళుతుంది. 
 
దీన్ని వెనుక నుంచి అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదం సరిగ్గా జిల్లాలోని కొండపాక మండలంలోని కొడకండ్ల గ్రామ శివారులో ఉన్న ఒక వంతెన వద్ద జరిగింది. 
 
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నాగమణి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గజ్వేల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments