Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీల దుర్మరణం

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (10:21 IST)
తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మిరపకాయల కోతకు వెళుతున్న ముగ్గురు కూలీలు మృత్యువాతపడ్డారు. మరో 15 మంది గాయపడ్డారు. వీరంతా బాధితులే కావడం గమనార్హం. 
 
మిరపకాయల కోత కోసం పత్తిపాకకు చెందిన చెందిన కొందరు కూలీలు ఒక ఆటోలో వెళుతున్నారు. ఈ ఆటోను మాందారిపేట వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 
 
మృతులను మంజుల (45), రేణుక (48), విమర (50)గా గుర్తించారు. క్షతగాత్రులను వరంగల్ జిల్లా ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments