Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దల పంచాయితీ పెట్టుకొని ఆస్తుల సమస్య తీర్చుకో: షర్మిలకు రేవంత్‌ సూచన

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (07:47 IST)
వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ఆవేదనతో ఏదో మాట్లాడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తప్పుబట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజకీయ పార్టీల నేతలు మాట్లాడితే తాను స్పందిస్తానని, ఎన్జీవో నడిపేవారు మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదని ఎద్దేవాచేశారు.

తెలంగాణ రాజకీయాలతో షర్మిలకు సంబంధం లేదని కొట్టిపారేశారు. వైఎస్ ఆస్తులకు వారసులు జగన్, షర్మిలేనని చెప్పారు. కులపెద్దల మధ్య పంచాయితీ పెట్టుకొని ఆస్తుల సమస్య తీర్చుకోవాలని సూచించారు. ‘‘వైఎస్ ఆస్తులు మాకొద్దు.. మేము వారసులం కాదు. రాజకీయంగా మాత్రం వైఎస్ కాంగ్రెస్ నాయకుడే’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

కాగా.. రేవంత్‌పై షర్మిల చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ... నిన్నమొన్న పార్టీ పెట్టిన వాళ్ల గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదని, షర్మిల ఏం మాట్లాడుతున్నారో ఆమెకే అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ తెలుగు సీజన్‌కు క్రేజ్ తగ్గిపోయినట్టేనా?

విశ్వం షూట్ లో ఫిజికల్ గా చాలెంజ్ లు ఎదుర్కొన్నా : కావ్యథాపర్

కొండా సురేఖపై విరుచుకుపడిన తెలుగు చిత్రపరిశ్రమ...

కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన మిస్టర్ సెలెబ్రిటీ ఆకట్టుకుంది : పరుచూరి వెంకటేశ్వరరావు

పవన్ గారూ.. గుడిలో ప్రసాదంతో పాటు మొక్కలు కూడా ఇవ్వండి : షాయాజీ షిండే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments