హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కేటీఆర్‌కు సంబంధం : రేవంత్ రెడ్డి

తెలంగాణలో ఇటీవల వెలుగుచూసిన డ్రగ్స్ మాఫియాపై ఈడీతో విచారణ జరిపించాలని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విష‌యంపైనే తాను ఈ రోజు అసెంబ్లీలో ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పకుండానే సభను వాయిదా

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2017 (15:30 IST)
తెలంగాణలో ఇటీవల వెలుగుచూసిన డ్రగ్స్ మాఫియాపై ఈడీతో విచారణ జరిపించాలని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విష‌యంపైనే తాను ఈ రోజు అసెంబ్లీలో ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పకుండానే సభను వాయిదా వేశారని ఆయ‌న ఆరోపించారు. ఈ రోజు అసెంబ్లీ ప్రాంగ‌ణంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ‌ మంత్రి కేటీఆర్‌కు డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉందని తాను భావిస్తున్న‌ట్లు చెప్పారు. 
 
కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు డ్రగ్స్ కేసుతో సంబంధాలున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాను అన్ని ఆధారాలతోనే ఈ ఆరోపణలు చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ‌లో డ్రగ్స్ విషయంపై తాను ఇప్ప‌టికే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు ఫిర్యాదు చేశానని తెలిపారు. 
 
తెలంగాణలో ఇటీవల వెలుగుచూసిన డ్రగ్స్ మాఫియాపై ఈడీ విచారణ జరిపించాలన్నారు. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు డ్రగ్స్ కేసుతో సంబంధాలున్నాయని, ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నా... దమ్ముంటే నాపై కేసు పెట్టండి అని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. చిన్న పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments