కెసిఆర్‌ తాగుబోతులకు బ్రాండ్‌ అంబాసిడర్‌: రేవంత్‌

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (12:48 IST)
కెసిఆర్‌ తాగుబోతులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారితే.. ఆయన కుమారుడు డ్రగ్స్‌ అమ్మకాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్టోబరు 2 నుంచి డిసెంబరు 9 వరకు నిరుద్యోగ గర్జనలు నిర్వహిస్తామని ప్రకటించారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ పై కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్మయుద్ధం ప్రకటిస్తున్నామని అన్నారు.

ఈ 19 నెలలు తెలంగాణ విముక్తి కోసం పోరాడతామని, రాష్ట్ర భవిష్యత్తును మార్చేస్తామని ప్రకటించారు. అరశాతం ఉన్న కులానికి ముఖ్యమంత్రితోపాటు మంత్రి పదవులు ఇచ్చారని, 12 శాతం ఉన్న మాదిగలకు ఒక్క మంత్రి పదవి కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

కొడుకు, అల్లుడిలో ఎవరో ఒకరిని మార్చి.. ఓ మాదిగ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వగలరా ? అని ప్రశ్నించారు. తన మనవడు తినే సన్నబియ్యమే పేద విద్యార్థులంతా తింటున్నారంటూ చెప్పడం కాదని, తన మనవడు చదివే స్కూల్‌లో పేద పిల్లలను చదివించాలని డిమాండ్‌ చేశారు.

విద్యార్థులు బలిదానాలు చేసుకున్నది సన్నబియ్యం కోసం, గొర్రెలు, బర్రెల కోసమేనా ? అని అడిగారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి కెసిఆర్‌ మోసం చేశారని, కానీ.. ఆయన కుటుంబంలో మాత్రం ఐదుగురికి పదవులు వచ్చాయని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కావాలని అన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చకుండా వేలాది మంది ప్రాణాలను బలిగొన్నారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Supriya : డెకాయిట్‌ క్లైమాక్స్ రిస్క్ అనిపించలేదు : సుప్రియ యార్లగడ్డ

Kiran Abbavaram: తిమ్మరాజుపల్లి టీవీ ఈతరం జెన్ జీ కిడ్స్ కు బాగా నచ్చుతుంది : వి. మునిరాజు

ఆప్ క్యూట్ హో... మోడల్ తాన్యా ఛటర్జీకి చాహల్ మెసేజ్ (Video)

Suma: రాజీవ్ ఐక్యూ వర్సెస్ సుమ జీబీ పేరుతో టెలివిజన్ వాణిజ్య ప్రకటనలో సుమ, రాజీవ్

హీరోయిన్ త్రిష ఇంటికి బాంబు బెదిరింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

మోచేతుల కింద నలుపు రంగు వదిలించుకునేదెలా?

కాహోకాన్ 2026 యొక్క 10వ ఎడిషన్‌ను ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఈ 5 జ్యూస్‌లు ఆరోగ్యానికి వరం

తమ రెండవ స్టోర్, సీజనల్ ఎడిట్‌తో వైజాగ్‌లో తమ కార్యకలాపాలను విస్తరించిన సోచ్

తర్వాతి కథనం
Show comments