Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీకి వెన్నుపోటు పొడిచిన కేసీఆర్ వంటి వ్యక్తితో స్నేహమా?

తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నేతలపై ఆ పార్టీకి చెందిన వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2017 (14:14 IST)
తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నేతలపై ఆ పార్టీకి చెందిన వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు దాసోహమైపోయారని ఆరోపించారు. ఆ కారణంగానే వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల విలువ చేసే కాంట్రాక్టులను కట్టబెడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఇదే అంశంపై రేవంత్ స్పందిస్తూ, కేసీఆర్ నుంచి యనమల రామకృష్ణుడు కంపెనీకి రూ.2 వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు దక్కగా, పయ్యావుల కేశవ్ సంస్థలకు కూడా కాంట్రాక్టులు వెళ్లాయని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్‌ను తెరాస ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తుంటే, ఏపీలో మాత్రం నేతలు కేసీఆర్‌తో అంటకాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ భిక్ష పెట్టిన పార్టీకి వెన్నుపోటు పొడిచిన కేసీఆర్ వంటి వ్యక్తితో స్నేహమా? అంటూ ఆయన సూటిగా నిలదీశారు. 
 
కాగా, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగగా, ఇంతవరకూ ఏపీకి చెందిన ఒక్క టీడీపీ నేత కూడా స్పందించక పోవడం గమనార్హం. రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఎవరూ ప్రకటన విడుదల చేయకపోవడం వెనుక పార్టీ అధినేత ఆదేశాలే కారణంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments