డిగ్రీ విద్యార్థులకు షాకిచ్చిన తెలంగాణ సర్కారు.. ప్రమోట్ అయినా పరీక్షలు రాయాల్సిందే...

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (20:47 IST)
కరోనా నేపథ్యంలో యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం డిగ్రీ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులను పరీక్షలు రాయకున్నా.. తర్వాత క్లాసులకు ప్రమోట్ అయ్యారు. అయితే కోర్స్ ముగిసే లోపు ఆ పరీక్షలు నిర్వహిస్తామని యూనివర్సిటీలు తాజాగా సర్క్యులర్ జారీ చేశాయి. దీంతో ప్రమోట్ అయిన డిగ్రీ విద్యార్థులు కోర్స్ ముగిసే లోపు ఆ పరీక్షలు రాయాల్సిందేనని తెలంగాణ ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది.
 
యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం డిగ్రీ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులను పరీక్షలు రాయకున్నా.. తర్వాత క్లాసులకు ప్రమోట్ అయ్యారు. అయితే కోర్స్ ముగిసే లోపు ఆ పరీక్షలు నిర్వహిస్తామని యూనివర్సిటీలు తాజాగా సర్క్యులర్ జారీ చేశాయి.
 
డీటైన్ అయిన విద్యార్థులు కూడా.. బ్యాక్ లాగ్స్ రాయాల్సిందేనని సర్క్యులర్ ద్వారా స్పష్టం చేశాయి. ఈ నెల 30 లోపు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు యూనివర్సిటీలు తెలిపాయి. అలానే ఫైనల్ ఇయర్ విద్యార్థులకు అక్టోబర్‌లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
 
అయితే సప్లిమెంటరీ నిర్వహించకుండా పాస్ చేయాలనే డిమాండ్ విద్యార్ధుల నుండి వస్తోంది. ఈ విషయం మీద ప్రభుత్వంతో మాట్లాడి యూజీసీకి లేఖ రాస్తామని ఉన్నత విద్యా మండలి తెలిపింది. యూజీసీ అనుమతి ఇవ్వకుంటే సప్లిమెంటరీ రాయాల్సిందేనని విద్యామండలి స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తండ్రి కూతురు సెంటిమెంట్ తో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ట్రైలర్

Sri Vishnu: విష్ణు విన్యాసం స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది : శ్రీ విష్ణు

Anupama: అనుపమ పరమేశ్వరన్ తో అగ్ర నిర్మాణ సంస్థ కొత్త మూవీ ప్రకటన

INCA: ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక

Chiranjeevi: సురేఖ నా భార్య మాత్రమే కాదు, నా బలం, నా అండ, నా ప్రశాంతత : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

తర్వాతి కథనం
Show comments