Webdunia - Bharat's app for daily news and videos

Install App

షెడ్యూల్ ప్రకారమే జేఈఈ, నీట్ పరీక్షలు.. తేల్చేసిన సుప్రీం కోర్టు

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (20:38 IST)
జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన జేఈఈ, నీట్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ పరీక్షల వాయిదా కోసం ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న ఆరు రాష్ట్రాల మంత్రులు దాఖలు చేసిన సంయుక్త రివ్యూ పిటిషన్‌ను ధర్మాసనం శుక్రవారం తిరస్కరించింది. జేఈఈ, నీట్ వాయిదాకు దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. 
 
కాగా, ఈ తీర్పుపై సమీక్ష కోరుతూ పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలు సంయుక్తంగా ఆగస్టు 28న సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఒకవైపు కరోనా, మరోవైపు వర్షాలు, వరదల పరిస్థితుల నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరాయి. 
 
ఆగస్టు 17న కోర్టు ఇచ్చిన తీర్పులో సమగ్ర న్యాయ పరిశీలన జరగలేదని చెప్పాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ కృష్ణ మురారితో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపి తిరస్కరించింది. జేఈఈ, నీట్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరగాలని చెప్పింది. ఈ నెల 1 నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరుగుతుండగా, 13న నీట్ పరీక్ష జరుగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments