రైతు బంధుకి దరఖాస్తు చేసుకోలేదా? ఇంకో ఛాన్స్ వచ్చేసింది..?

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (09:52 IST)
తెలంగాణలో రైతుబంధు పథకం ప్రయోజనాలు అందుకోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎంతో మందికి అండగా నిలుస్తున్న రైతుబంధు పథకం కోసం ఇప్పటి వరకు కొంత మంది రైతులు దరఖాస్తు చేసుకోలేదు. అలాంటి రైతులు దరఖాస్తు చేసుకోడానికి వ్యవసాయ శాఖ మరో అవకాశం కల్పించింది. 
 
ఈ ఏడాదే జనవరి నెలలో కొత్తగా పాస్ పుస్తకాలు తీసుకున్న రైతులు, ఇంతకు ముందే పాస్ పుస్తకాల ఉండికూడా దరఖాస్తు చేసుకోనివారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ నెల 13వ తేదీ లోగా రైతుబంధుకోసం రైతులు దరఖాస్తుచేసుకునే అవకాశం కల్పించింది. 
 
రైతుల అర్హతల ఆధారంగా ఈ పథకం ద్వారా మీ చెక్కుల రూపంలో సాయం చేస్తుంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 58.34 లక్షల మంది రైతులకు పెట్టుబడిసాయం అందిస్తుంది. ఎకరానికి రూ.4 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేస్తోంది. ఖరీఫ్, రబీ ఈ రెండు సీజన్లకుగాను ఎకరానికి రూ. 5000 చొప్పున రూ. 10,000లను రైతుకు చెక్కుల రూపంలో ఇవ్వనున్నారు.
 
రైతు బంధు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.. దరఖాస్తు ఫారంతో పాటు భూమి పట్టా పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్(సేవింగ్స్ అకౌంట్), ఎమ్మార్వో డిజిటల్ సంతకం చేసిన పేపర్ జోడించాలి. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Actress Eesha Rebha: ఇన్‌స్టాగ్రామ్ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Peddi: రామ్ చరణ్ చిత్రం పెద్ది విడుదల వాయిదా వేశారు

Rajasekhar: బుల్లెట్ సునీల్ గా రాజశేఖర్ పవర్ ఫుల్ రీ-స్టార్ట్ గ్లింప్స్ రిలీజ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీ ప్రకటన

J. D. Chakravarthy: ప్రచారం కోసం బూతులు మాట్లాడడాన్ని బరాబర్ ఖండిస్తున్నా : జె. డి. చక్రవర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

తర్వాతి కథనం
Show comments