Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతు బంధుకి దరఖాస్తు చేసుకోలేదా? ఇంకో ఛాన్స్ వచ్చేసింది..?

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (09:52 IST)
తెలంగాణలో రైతుబంధు పథకం ప్రయోజనాలు అందుకోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎంతో మందికి అండగా నిలుస్తున్న రైతుబంధు పథకం కోసం ఇప్పటి వరకు కొంత మంది రైతులు దరఖాస్తు చేసుకోలేదు. అలాంటి రైతులు దరఖాస్తు చేసుకోడానికి వ్యవసాయ శాఖ మరో అవకాశం కల్పించింది. 
 
ఈ ఏడాదే జనవరి నెలలో కొత్తగా పాస్ పుస్తకాలు తీసుకున్న రైతులు, ఇంతకు ముందే పాస్ పుస్తకాల ఉండికూడా దరఖాస్తు చేసుకోనివారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ నెల 13వ తేదీ లోగా రైతుబంధుకోసం రైతులు దరఖాస్తుచేసుకునే అవకాశం కల్పించింది. 
 
రైతుల అర్హతల ఆధారంగా ఈ పథకం ద్వారా మీ చెక్కుల రూపంలో సాయం చేస్తుంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 58.34 లక్షల మంది రైతులకు పెట్టుబడిసాయం అందిస్తుంది. ఎకరానికి రూ.4 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేస్తోంది. ఖరీఫ్, రబీ ఈ రెండు సీజన్లకుగాను ఎకరానికి రూ. 5000 చొప్పున రూ. 10,000లను రైతుకు చెక్కుల రూపంలో ఇవ్వనున్నారు.
 
రైతు బంధు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.. దరఖాస్తు ఫారంతో పాటు భూమి పట్టా పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్(సేవింగ్స్ అకౌంట్), ఎమ్మార్వో డిజిటల్ సంతకం చేసిన పేపర్ జోడించాలి. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments