Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తాం.. రాహుల్ గాంధీ

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (10:36 IST)
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా సంపదను దోచుకుంటోందని కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్‌ఎస్‌ పార్టీకి ఏటీఎంలా మారిందని ఆరోపించారు. తెలంగాణలో లక్షల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము దోచుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ సొమ్మంతా దోచుకుంటుందన్నారు. 
 
భూపాలపల్లి జిల్లా అంబటిపల్లిలో రాహుల్ గాంధీ పర్యటించారు. మేడిగడ్డ ప్రాజెక్టును రాహుల్ పరిశీలించారు. మహదేవపూర్ మండలం అంబటిపల్లిలో నిర్వహించిన మహిళా సాధికారత సదస్సుకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. మహానుభావుల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలు అని పేర్కొన్నారు.
 
బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒకవైపు, కాంగ్రెస్‌ మరోవైపు ఉన్నాయన్నారు. ప్రధాన పోటీ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే ఉందన్నారు. బీఆర్‌ఎస్‌కు బీజేపీ, ఎంఐఎం మద్దతు పలుకుతున్నాయన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని, బీఆర్‌ఎస్‌ను గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
 
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు రూ.2500 అందజేస్తామన్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments