Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన చదువు తండ్రికి భారం కాకూడదని ఐశ్వర్య ఆత్మహత్య, సంతాపం తెలిపిన రాహుల్ గాంధీ

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (18:56 IST)
లాక్ డౌన్ సమయంలో హాస్టల్ యాజమాన్యం బలవంతంగా ఖాళీ చెయ్యమనడంతో మనస్థాపానికి గురైన డిగ్రీ విద్యార్థిని ఐశ్వర్య రెడ్డి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన చదువు తండ్రికి భారం కాకూడదన్న ఉద్దేశంతో ఐశ్వర్య ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
 
ఈ విషయం చాలామందిని కదలించింది. దీనిపై స్పందిచిన కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా స్పందిస్తూ ఈ విచారకర సందర్భంలో ఐశ్వర్య కుటుంబానికి తన సంతాపాన్ని తెలుపుకుంటున్నానని పోస్ట్ చేశారు. బీజేపీ అనాలోచితంగా రద్దు చేసిన నోట్లు, లాక్ డౌన్ దేశ వ్యాప్తంగా పలు కుటుంబాలను నాశనం చేసిందని తెలిపారు.
 
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌కు చెందిన ఐశ్వర్య ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించారు. పైచదువుల కోసం ఢిల్లీ వెళ్లి అక్కడ శ్రీరామ డిగ్రీ కాలేజీలో చదువుతూ ఐఏఎస్ కోచింగ్ తీసుకుంది.
 
అయితే కరోనా కారణంగా తను ఉంటున్న హాస్టల్ యాజమాన్యం ఖాళీ చెయ్యమనడంతో కోవిడ్ నేపథ్యంలో తన కుటుంబానికి భారం కాకూడదని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నెల 3న ఆత్మహత్యకు పాల్పడిన ఐశ్వర్య తన కుటుంబ ఆర్థిక పరిస్థితులే ఇందుకు కారణమని సూసైడ్ నోట్ రాసింది. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments