రేవంత్‌ రెడ్డికి భద్రత పెంచండి... ఖర్చు ఆయనే భరించాలి... హైకోర్టు

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (19:13 IST)
టీ కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరిన విధంగానే ఆయనకు భద్రతను పెంచాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిని హైకోర్టు ఆదేశించింది. అయితే భద్రతకు అయ్యే ఖర్చును రేవంత్ రెడ్డే భరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. తనకు కేంద్ర సిబ్బందితో నిరంతరం నలుగురు ఉండేలా భద్రత కల్పించాలని కోరుతూ రేవంత్ రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్ పైన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
 
రాష్ట్ర ప్రభుత్వంపై ముఖ్యంగా కేసీఆర్‌పై పోరాడుతున్నందున తనకు ప్రాణ హాని ఉందని రేవంత్ ఆరోపించారు. ఎన్నికల సమయం కాబట్టి తనకు 4+4 భద్రత కల్పించాలని కోరారు. తనకు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదని.. కేంద్ర భద్రత కావాలని ఈసీని, కేంద్రాన్ని కోరినప్పటికీ స్పందన లేదన్నారు.  వాదనల అనంతరం హైకోర్టు.. రేవంత్ రెడ్డి కోరిన విధంగా భద్రత పెంపును కల్పించాలని, ఖర్చులను ఆయనే భరించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం