ప్రియాంక రెడ్డి కేసు, నలుగురు నిందితులను అరెస్ట్ చేశాం: సిపి సజ్జనార్

Webdunia
శుక్రవారం, 29 నవంబరు 2019 (20:02 IST)
సంచలనం సృష్టించిన వైద్యురాలు ప్రియాంక రెడ్డి కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సిపి సజ్జనార్ మీడియాకు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... 28 రాత్రి మాకు కంప్లైంట్ అందింది. 10 బృందాలను ఏర్పాటు చేసి గాలించాం. 29 ఉదయాన మృతదేహాన్ని గుర్తించాం. 
 
మాకు లభించిన ఆధారాలతో మహబూబ్ పాషా, జొల్లు నవీన్, జొల్లు శివ, చింతకుంట చెన్నకేశవులు అనే నలుగురు వ్యక్తులు నిందితులుగా అదుపులోకి తీసుకున్నాం. నవీన్ అనేవాడు స్కూటీ టైరు గాలి తీశాడు. ప్రియాంక తిరిగి రాగానే పంక్చర్ అయిందని నమ్మించారు.
 
ఆమె వెళ్లేందుకు సిద్ధమైతే వారించి నవీన్, శివ అనే ఇద్దరు స్కూటీ తీసుకుని వెళ్లి గాలి కొట్టించుకుని తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఆమె ఆ వెహికల్ తీసుకుని వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో నలుగురు ఆమెపై దాడి చేసి నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆమెకి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. 
 
ఆ తర్వాత ఇద్దరు స్కూటీ పైన, మరో ఇద్దరు లారీలో అక్కడి నుంచి బయలుదేరారు. ప్రియాంక మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి లారీ క్యాబిన్లో తరలించారు. షాద్ నగర్ వంతెన కింద ప్రియాంక మృతదేహానికి పెట్రోలు పోసి నిప్పంటించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్లీ తిరిగి వచ్చి మృతదేహం కాలిపోయిందా లేదా అని చూశారు. ఆ తర్వాత స్కూటీని సమీపంలోనే వదిలేసి లారీలో నలుగురు వెళ్లిపోయి, లారీలో వున్న ఇనుప లోడును సంబంధిత షాపు వద్ద అన్ లోడ్ చేసి ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments