Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుపై కసరత్తు.. ఎంతంటే?

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2022 (09:24 IST)
తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుపై సవరణ ముగిసింది. ఇంజినీరింగ్‌ ఫీజుల సవరణపై తెలంగాణ ఫీజ్‌, అడ్మిషన్స్‌ అండ్‌ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) చేపట్టిన కసరత్తులో భాగంగా ఈ ఏడాది బీటెక్‌ కనిష్ఠ ఫీజు రూ.45వేలు, గరిష్ఠ ఫీజు ఎంజీఐటీలో రూ.1.60లక్షలుగా ఖరారైంది. 10 నుంచి 12 కాలేజీల్లో ఫీజులు లక్షకుపైగా ఉన్నట్టు టీఏఎఫ్‌ఆర్‌సీ పేర్కొంది. 
 
పలు కాలేజీలు తప్పుడు లెక్కలు చూపాయని, ఆడిటింగ్‌ లోపాల కారణంగా ఫీజుల్లో భారీ తేడాలున్నాయని  టీఏఎఫ్‌ఆర్‌సీ అధికారులు వెల్లడించారు. ఫీజుల ఖరారుకు టీఏఎఫ్‌ఆర్‌సీ అధికారులు ఈ నెల 20, 21, 22న 90కి పైగా కాలేజీలను విచారణకు పిలిచి పరిశీలించారు. 
 
వీటిన్నింటిపై కూలంకషంగా ఓ నివేదికను రూపొందించారు. శనివారం నిర్వహించే టీఏఎఫ్‌ఆర్‌సీ కమిటీ సమావేశం ముందు ఆ నివేదికను ప్రవేశపెట్టనున్నారు. అధిక ఫీజు రాబట్టాలన్న ఒక కాలేజీ గుట్టు రట్టు అయింది. గతంలో చేపట్టిన విచారణ ప్రకారం టీఏఎఫ్‌ఆర్‌సీ పలు కాలేజీలకు ఫీజులు ఖరారు చేసింది.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments