Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో నీటి ప్రాజెక్టులను పరిశీలించిన ప్రశాంత్ కిషోర్

Webdunia
ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (15:49 IST)
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టారు. ఆయన సినీ నటుడు ప్రకాష్ రాజ్‌తో కలిసి ఆ రాష్ట్రంలో చేపట్టిన అనేక నీటి ప్రాజెక్టులను ఆదివారం పరిశీలించారు. ముఖ్యంగా, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భగంగా ఉన్న మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను ఆయన ప్రకాష్ రాజ్‌తో కలిసి పరిశీలించారు. ఆ తర్వాత మల్లన్న నిర్వాసితులతోకలిసి మాట్లాడారు. 
 
రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించిన పీకే బృందం... గత రెండు రోజులుగా తెలంగాణాలో పర్యటిస్తుంది. అలాగే, ప్రపంచంలో అతిపెద్దదైన ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం తుది దశకు చేరుకుంది. ముఖ్యంగా మల్లన్న సాగర్ తెలంగాణకు గుండెకాయ వంటిగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులన్నింటినీ పీకే బృందం పరిశీలించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటో ఏ ఒక్కరికీ బోధపడటం లేదు.
 
ఇదిలావుంటే, జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా మరో కూటమిని ఏర్పాటు చేసే విషయంపై ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ దృష్టిసారించారు. ఇందులోభాగంగా ఆయన అనేక మంతి విపక్ష నేతలతో సమావేశమవుతూ మంతనాలు జరుపుతున్నారు. అదేసమయంలో ప్రశాంత్ కిషోర్‌ను తన ఎన్నికల వ్యూహకర్తగా సీఎం కేసీఆర్ నియమించుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

దర్శన్ అభిమాని రేణుకస్వామి హత్య కేసు : వెలుగులోకి సంచలన విషయాలు

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments