Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో కరెంట్ చార్జీల బాదుడు???

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (11:26 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ చార్జీల బాదుడు తప్పేలా కనిపించడంలేదు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి కరెంట్ ఛార్జీలు పెంచాలని డిస్కంలు ప్రభుత్వానికి తెలపడం చూస్తుంటే.. త్వరలోనే ఛార్జీల పెంపు ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల ఆదాయం పెరిగి ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కొచ్చనేది డిస్కంల ప్లాన్.
 
రాష్ట్రంలోని రెండు డిస్కంలు ప్రస్తుతం నష్టాల్లో కూరుకుపోయాయి. ఈ నష్టాలను పూడ్చేందుకు నెలకు రూ.873 కోట్లు ఇస్తోంది ప్రభుత్వం. అయినా.. యూనిట్‌‌కు సగటున 90 పైసల దాకా నష్టం వస్తున్నట్లు అంచనా. ఈ నష్టం నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం నుంచి అదనపు నిధులను డిస్కంలు కోరగా అక్కడ చుక్కెదురైంది. దీంతో చార్జీలను పెంచేందుకు అనుమతించాలంటూ ఒత్తిడి తెస్తున్నాయి. 
 
గతేడాది ప్రజలకు 56,111 మిలియన్‌ యూనిట్ల విద్యుత్ సరఫరా చేస్తే డిస్కంలకు రూ.30,330 కోట్ల ఆదాయం వచ్చింది. కానీ.. వచ్చిన దానికంటే అదనంగా రూ.9 వేల కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం. ఈ ఏడాది కూడా ఆదాయ, వ్యయాల మధ్య లోటు నెలకు రూ.వెయ్యి కోట్ల దాకా ఉంటోందని చెబుతున్నాయి. 
 
కానీ, ఆ నష్టాన్ని భర్తీ చేయాలంటే మరిన్ని రాయితీ నిధులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అలాగే ఒక్కో యూనిట్‌‌కు ఎంత పెంచాలనే దానిపై ఇప్పటికే డిస్కంలు కసరత్తు కూడా చేస్తున్నాయట. ఈ నెలాఖరులోగా వచ్చే ఏడాదికి సంబంధించిన ఏఆర్‌ఆర్‌, ఛార్జీల పెంపు ప్రతిపాదనలు ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments