Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంజారాహిల్స్ రేప్ కేసు - ఇన్నోవా కారు డ్రైవర్‌ - తల్లిదండ్రులపై కేసు

Webdunia
బుధవారం, 15 జూన్ 2022 (10:28 IST)
దేశంలో సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ బాలిక అత్యాచారం కేసులో నిందితులు ఉపయోగించిన ఇన్నోవా కారు డ్రైవర్‌తో పాటు నిందితుల తల్లిదండ్రులపై హైదరాబాద్ నగర పోలీసులు కేసులు నమోదు చేశారు. పోక్సో చట్ట ప్రకారం మైనర్ బాలికపై అత్యాచారం జరిగినపుడు ఆ విషయం తెలిసి కూడా పోలీసులకు సమాచారం ఇవ్వక పోవడాన్ని నేరంగా పరిగణిస్తారు. 
 
ఈ నేపథ్యంలో సాదుద్దీన్ సహా మిగతా నిందితుల తల్లిదండ్రులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెంజ్, ఇన్నోవా కార్లను మైనర్లు నడిపినట్టు సాక్ష్యాలు సేకరించిన పోలీసులు ట్రాఫిక్, శాంతిభద్రతల పోలీసులు కేసులు నమోదు చేశారు. 
 
అలాగే, బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు ఆ తర్వాత ఆధారాలను చెరిపివేసే ప్రయత్నం చేసినట్టు గుర్తించిన పోలీసులు అందుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించారు. బాధితురాలిని తీసుకెళ్లిన ఇన్నోవా కారు పోలీసుల దృష్టిలో పడకుండా ప్రభుత్వ సంస్థ ఛైర్మన్ కారును డ్రైవర్‌కు అప్పగించారు. 
 
అతడు దానిని మెయినాబాద్‌ సమీపంలోని అజీజ్‌నగర్‌లో ఓ వ్యవసాయ క్షేత్రంలో నిలిపి వచ్చేశాడు. ఆ క్షేత్రం ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌దేనని విచారణలో నిందితులు పోలీసులకు తెలిపారు. కాగా, మైనర్ల విచారణ మంగళవారంతో ముగిసింది. కోర్టు అనుమతిస్తే కనుక ఒకటి రెండు రోజుల్లో టెస్ట్ ఐడెంటిఫికేషన్‌ పరేడ్‌ నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments