Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్ఐ - కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కారు

Webdunia
సోమవారం, 30 జనవరి 2023 (10:18 IST)
ఎస్.ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రిలిమ్స్ పరీక్షలో వివాదాస్పదమైన ఏడు ప్రశ్నల విషయంలో ఉదారంగా స్పందించింది. ఈ ఏడు ప్రశ్నలకు మార్కులు వేయాలని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) తాజాగా నిర్ణయం తీసుకుంది. 
 
కాగా, ప్రిలిమ్స్‌లో తప్పు ప్రశ్నలపై పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. వారు ఆందోళనకు కూడా దిగారు. బీజేవైఎం శ్రేణులు కూడా పోలీసు ఉద్యోగ అభ్యర్థులకు అండగా నిలించారు. దీంతో దిగివచ్చిన బోర్డు.. కొత్తగా ప్రశ్నలకు మార్కులు జోడించి, ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల జాబితాను ఈ నెల 30వ తేదీ లోపు వెబ్‌సైట్‌లో ఉంచుతామని ఏ ప్రకటనలో తెలిపింది. 
 
ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు పార్ట్-2 కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. అయితే, ఇదివరకే పీఈటీ, పీఎంటీ టెస్టులో అర్హత సాధించిన వారు పార్ట్-2కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని వివరించింది. పార్ట్-2 దరఖాస్తులు ఫిబ్రవరి ఒకటో తేదీన నుంచి ఫిబ్రవరి 5వ తేదీ లోపు సమర్పించాల్సి ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

Ravi Mohan: రవికి చెక్ పెట్టిన భార్య ఆర్తి.. భరణం కింద రూ.40లక్షలు ఇవ్వాల్సిందే

1991లో వీరరాజు కు ఏం జరిగింది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments