Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్ఐ - కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కారు

Webdunia
సోమవారం, 30 జనవరి 2023 (10:18 IST)
ఎస్.ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రిలిమ్స్ పరీక్షలో వివాదాస్పదమైన ఏడు ప్రశ్నల విషయంలో ఉదారంగా స్పందించింది. ఈ ఏడు ప్రశ్నలకు మార్కులు వేయాలని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) తాజాగా నిర్ణయం తీసుకుంది. 
 
కాగా, ప్రిలిమ్స్‌లో తప్పు ప్రశ్నలపై పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. వారు ఆందోళనకు కూడా దిగారు. బీజేవైఎం శ్రేణులు కూడా పోలీసు ఉద్యోగ అభ్యర్థులకు అండగా నిలించారు. దీంతో దిగివచ్చిన బోర్డు.. కొత్తగా ప్రశ్నలకు మార్కులు జోడించి, ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల జాబితాను ఈ నెల 30వ తేదీ లోపు వెబ్‌సైట్‌లో ఉంచుతామని ఏ ప్రకటనలో తెలిపింది. 
 
ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు పార్ట్-2 కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. అయితే, ఇదివరకే పీఈటీ, పీఎంటీ టెస్టులో అర్హత సాధించిన వారు పార్ట్-2కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని వివరించింది. పార్ట్-2 దరఖాస్తులు ఫిబ్రవరి ఒకటో తేదీన నుంచి ఫిబ్రవరి 5వ తేదీ లోపు సమర్పించాల్సి ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments