ఓ కానిస్టేబుల్ అక్రమ వసూళ్లు... ట్విట్టర్‌ ద్వారా స్పందించిన డీజీపీ

Webdunia
శనివారం, 10 ఆగస్టు 2019 (21:29 IST)
కానిస్టేబుల్‌ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. వర్ధన్నపేట పోలీసుస్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు ఉన్న వీడియోను షేర్‌ చేస్తూ వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ రవీందర్‌ను విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన ట్విట్టర్‌ ద్వారా ఆదేశించారు. 
 
ఇటీవల రెండు రోజుల క్రితం వర్ధన్నపేట సీఐ ఇసుక ర్యాంపులు, మద్యం దుకాణాలపై మామూళ్లు వసూలు చేస్తున్నట్లు సీపీ దృష్టికి వెళ్లడంతో అతనికి మెమో జారీ చేసినప్పటికీ, అదే స్టేషన్‌ పరిధిలో ఓ కానిస్టేబుల్‌ అక్రమ వసూళ్ల వీడియో వైరల్‌ కావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
 
ఆ వీడియోలో ఇసుక ట్రాక్టర్ల యాజమానుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయమై వర్ధన్నపేట ఏసీపీ మధుసూదన్‌ను వివరణ కోరగా ఉన్నతాధికారుల నుంచి విచారణ చేపట్టాలని ఉత్తర్వులు అందినట్లు పేర్కొన్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత్ శోభన్ హీరోగా నిహారిక కొణిదె నిర్మిస్తోన్న రాకాస డేట్ ఫిక్స్

మీర్జాపురం రాణి కృష్ణవేణి అరుదైన భగీరథ ప్రయత్నం

375 కోట్లకు పైగా వసూలు చేసిన మెగాస్టార్ చిరంజీవి మన శంకరవర ప్రసాద్ గారు

యుఫోరియా చూసిన తరువాత రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోయాను : భూమిక

జియో స్టార్‌లో ప్ర‌భాస్ .. ది రాజా సాబ్ ఎక్స్‌టెండెడ్ క‌ట్‌తో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

తర్వాతి కథనం
Show comments