Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరంలో హవాలా మనీ పట్టివేత - మంత్రి జగదీష్ కారులో తనిఖీలు

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2022 (15:33 IST)
హైదరాబాద్ నగరంలో మరోమారు భారీగా హవాలా నగదును పట్టుకున్నారు. గత నాలుగు రోజుల్లో జూబ్లీహిల్స్‌లో భారీగా హవాలా నగదును పట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నగరంలో మరోమారు భారీగా హవాలా నగదు పట్టుబడింది. 
 
గాంధీనగర్ లో నిర్వహించిన తనిఖీల్లో పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి ఆధారాలు, నగదుకు సంబంధించిన రశీదులు లేకపోవడంతో రూ.3.5 కోట్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో అక్రమంగా నగదు తరలిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
 
ఇదిలావుంటే, తెలంగాణ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి కారును పోలీసులు తనిఖీ చేశారు. ఈ ఘటన న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో జరిగింది. మునుగోడు ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. 
 
ఈ క్రమంలో మునుగోడు ప్రాంతంలో ప్రత్యేక పికెట్‌ను ఏర్పాటు చేసి వాహనాలను చెక్ చేస్తున్నారు. ఆ సమయంలో మునుగోడు వైపు వెళుతున్న మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి వాహ‌నాన్ని క్షుణ్ణంగా త‌నిఖీ చేశారు. మునుగోడు ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని.. అందుకు తాను సహకరిస్తానని మంత్రి తనిఖీ బృందంతో చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments