Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.105 కోట్ల ఘరానా మోసం.. ముంబైలో నిందితుల అరెస్ట్

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (12:56 IST)
రుణం పేరిట జరిగిన ఘరానా మోసంలో నిందితులు చిక్కారు. మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి నిర్మాణ సంస్థకు రూ.105 కోట్లను మోసం చేసిన కేసులో నిందితులు ముంబైలో అరెస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. సోమాజీగూడలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రుణం కోసం యత్నాలు చేస్తుండగా, గత జూన్‌లో ఛాంపియన్ ఫిన్‌సెక్ కంపెనీ (సీఎఫ్ఎల్) ప్రతినిధులు హర్షవర్ధన్, బాలూభాయ్ పటేల్‌లు ఇందిరారెడ్డి సంప్రదించారు. 
 
బ్యాకింగేతర సంస్థల నుంచి రూ.11.50 కోట్ల రుణం ఇప్పిస్తామని చెప్పారు. రుణం మంజూరయ్యాక తమకు ఒక శాతం కమీషన్ ఇవ్వాలన్నారు. పూచీకత్తుగా నిర్మాణ సంస్థ షేర్లు తనఖా ఉంచాలని కోరారు. అంగీకరించిన ఇందిరా రెడ్డి 32.50 లక్షల షేర్లను సీఎఫఎల్ పేరుపై బదిలీ చేశారు.
 
రుణం అందకపోవడంతో హైదరాబాద్‌లోని సీఎఫ్ఎల్ పేరుపై బదిలీ చేశారు. రుణం అందకపోవడంతో హైదరాబాదులోని సీఎఫ్ఎల్ కార్యాలయానికి వెళ్లగా, హర్షవర్ధన్, బాలూభాయ్‌లు ఇద్దరూ లేరు. 
 
వీరిద్దరూ తమకు అప్పు ఇప్పిస్తామని చెప్పారని, ఇందుకు షేర్లను తనఖా వుంచుకుని వాటిని అమ్మి రూ.105 కోట్లు కాజేశారని సుబ్బరామిరెడ్డి సతీమణి ఇందిరారెడ్డి గత జులైలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రోసెసింగ్ రుసుం పేరుతో షేర్ల పత్రాలను కూడా తీసుకున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments