Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే నెలలో భాగ్యనగరికి వస్తున్న ప్రధాని.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 27 మార్చి 2023 (13:36 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెలలో హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. ఏప్రిల్ 8వ తేదీన భాగ్యనగరికి వచ్చే ఆయన... సికింద్రాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య వందే భారత్ రైలు సేవలను జెండా ఊపి ప్రారంభిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సికింద్రాబాద్ - విశాఖపట్టణం ప్రాంతాల మధ్య ఈ వందే భారత్ రైలు నడుస్తున్న విషయం తెల్సిందే. ఇపుడు కొత్తగా మరో రైలును తెలుగు రాష్ట్రాల్లో నడుపనున్నారు. అయితే, సికింద్రాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య నడిపే వందే భారత్ రైలు ప్రయాణ సమయం, చార్జీలను దక్షిణ మధ్య రైల్వే బహిర్గతం చేయాల్సివుంది.
 
ఇదిలావుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుకు, ప్రధాని మోడీకి ఏమాత్రం పొసగడం లేదు. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అలాగే, ఈ రెండు పార్టీల నేతల మధ్య కూడా మాటల యుద్ధం సాగుతోంది. గతంలో ప్రధాని హైదరాబాద్ నగరానికి వచ్చినపుడు కూడా ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ ఎయిర్‌పోర్టుకు కూడా వెళ్లని విషయం తెల్సిందే. మరి ఈ దఫా ఎలా చేస్తారో వేచి చూడాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments