సికింద్రాబాద్ - విశాఖల మధ్య వందే భారత్ రైలు : మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి

Webdunia
మంగళవారం, 10 జనవరి 2023 (09:03 IST)
త్వరలో తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైలు పరుగులు పెట్టనుంది. భారతీయ రైల్వే శాఖ తెలంగాణ రాష్ట్రానికి ఒక వందే భారత్ రైలును కేటాయించింది. ఈ రైలు సేవలను ఈ నెల 19వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రారంభించనున్నారు. ఈ రైలు తొలుత సికింద్రాబాద్ - విజయవాడల మధ్యే నడుపుతారంటూ వార్తలు వచ్చాయి. 
 
అయితే, తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాత్రం.. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం వరకు నడుస్తుందని తెలిపారు. ఈ వందే భారత్ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖ, విశాఖ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య నడుస్తుందన్నారు. 
 
ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బయలుదేరి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖకు చేరుకుంటుందని తెలిపారు. కాగా, ఈ నెల 19వ తేదీన ఈ రైలు సేవలకు ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభిస్తారని తెలిపారు. కాగా, ఇది దేశంలో ప్రారంభమయ్యే ఎనిమిదో వందే భారత్ రైలు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments