Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికింద్రాబాద్ - విశాఖల మధ్య వందే భారత్ రైలు : మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి

Webdunia
మంగళవారం, 10 జనవరి 2023 (09:03 IST)
త్వరలో తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైలు పరుగులు పెట్టనుంది. భారతీయ రైల్వే శాఖ తెలంగాణ రాష్ట్రానికి ఒక వందే భారత్ రైలును కేటాయించింది. ఈ రైలు సేవలను ఈ నెల 19వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రారంభించనున్నారు. ఈ రైలు తొలుత సికింద్రాబాద్ - విజయవాడల మధ్యే నడుపుతారంటూ వార్తలు వచ్చాయి. 
 
అయితే, తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాత్రం.. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం వరకు నడుస్తుందని తెలిపారు. ఈ వందే భారత్ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖ, విశాఖ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య నడుస్తుందన్నారు. 
 
ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బయలుదేరి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖకు చేరుకుంటుందని తెలిపారు. కాగా, ఈ నెల 19వ తేదీన ఈ రైలు సేవలకు ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభిస్తారని తెలిపారు. కాగా, ఇది దేశంలో ప్రారంభమయ్యే ఎనిమిదో వందే భారత్ రైలు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments