భాగ్యనగరిలో మూడు రోజులు మకాం వేయనున్న ప్రధాని మోడీ

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (16:39 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ నగరంలో మూడు రోజుల పాటు బస చేయనున్నారు. ఆయనతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఇక్కడే ఉండనున్నారు. తెలంగాణా రాష్ట్రంపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా దృష్టిసారించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ గడ్డపై మరింతగా బలం పెంచుకోవాలన్న ఉద్దేశ్యంతో బీజేపీ నేతలు తెలంగాణాపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. 
 
ఇదిలావుంటే, ఈ నెల 15వ తేదీపైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ నగరంలో నిర్వహించేలా ప్లాన్ చేశారు. మూడు రోజుల పాటు ఈ సమావేశాలను నిర్వహించనుంది. ఈ సమావేశాలకు ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. 
 
అలాగే, ఈ కార్యవర్గ సమావేశాలకు దేశం నలు మూలల నుంచి దాదాపు 300 నుంచి 500 మంది ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. అయితే, ఈ సమావేశాలను హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లేదా నోవాటెల్ లేదా తాజ్‌కృష్ణ నక్షత్ర హోటళ్లలో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. భద్రతగా  పరంగా అన్ని అంశాలను పరిగణలోని తీసుకున్న తర్వాత ఈ కార్యవర్గ సమావేశాలు జరిగే వేదికను ఖరారు చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments