Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒప్పందం ప్రకారమే తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు : కేంద్రం

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (15:55 IST)
గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై భారత ఆహార సంస్థ (ఎఫ్.సి.ఐ) కుదుర్చుకున్న ఒప్పంద మేరకు ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు కేంద్ర ఆహార శాఖామంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. ధాన్యం కొనుగోలు అంశంపై శుక్రవారం రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అడిగిన ప్రశ్నకు మంత్రి గోయల్ సమాధానమిచ్చారు.
 
ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ధాన్యం కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఈ ఒప్పందాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుండాలని కోరారు. ఆ లెక్కన తెలంగాణానే ఇంకా ధాన్యం పంపించాల్సి వుందని సభకు తెలిపారు. ధాన్యం కొనుగోలు అంశంలో తెరాస సభ్యులు సభలో గందరగోళం సృష్టిస్తున్నారని మంత్రి గోయల్ వివరించారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 24 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలుకు ఒప్పందం కుదిరిందన్నారు ఆ తర్వాత ఈ ఒప్పందాన్ని 44 లక్షల టన్నుల సేకరణకు పెంచామన్నారు. ఆ ప్రకారంగా ఇప్పటివరకు 27 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ తెలంగాణ నుంచి వచ్చిందని, ఇంకా 17 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ రావాల్సి వుందన్నారు. ఒప్పందం ప్రకారం పంపించాల్సిన ధాన్యం పంపించకుండా కేంద్రాన్ని ప్రశ్నిస్తుండటం అర్థరహితంగా ఉందని మంత్రి సభలో వివరణ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments