Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్లు తాగడానికి బెంజ్ కార్లలో వస్తున్నారు, ఎందుకో తెలుసా? అంటూ చెప్పిన తెలంగాణ మంత్రి

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (14:38 IST)
స్వచ్చమైన కల్లులో 15 రకాల రోగాలను తగ్గించే ఔషధ గుణాలున్నాయని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ విషయం శాస్త్రవేత్తల రీసెర్చ్‌లో తేలిందని తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం కల్లు కోసం బెంజ్ కార్లలో సైతం వస్తున్నారని తెలిపారు.
 
జనగామ జిల్లా మండెలగూడెంలో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన కల్లులో కేన్సర్‌ను తగ్గించే గుణాలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. గీత కార్మికుల సంక్షేమానికి టీఆర్ఎస్ సర్కారు కట్టుబడి ఉందన్నారు.
 
శివాజీ పరిపాలన సమయంలో సర్వాయి పాపన్న సామాజిక న్యాయం కోసం పోరాడారని, 400 ఏళ్ల క్రితమే ప్రజల్లో మార్పు కోసం ఆయన పోరాడారని కొనియాడిన ఆయన పాపన్న కోటలను టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. బొమ్మకూరు రిజర్వాయర్లో వీరు చేప పిల్లలను వదిలారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments