ట్రాక్ మెయింటనెన్స్ పనులు... 9వ తేదీ వరకు పలు రైళ్ళు రద్దు

Webdunia
ఆదివారం, 2 జులై 2023 (11:38 IST)
సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ల పరిధిలో ట్రాక్ మరమ్మతు, సిగ్నలింగ్ ఇంజనీరింగ్ పనుల కారణంగా పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ రైళ్ళను రద్దు చేస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. మొత్తం 24 రైళ్ళ సర్వీసులను తత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. అలాగే, లింగంపల్లి, ఫలక్ నుమా, ఉందానగర్, రామచంద్రాపురం మధ్య నడిచే 22 ఎంఎంటీఎస్ సర్వీసులను కూడా రద్దు చేస్తున్నామని, అందువల్ల ప్రయాణికులు సహకరించాలని కోరారు. 
 
కాగా, రద్దు చేసిన రైళ్ల సర్వీసులను పరిశీలిస్తే, కాజీపేట - డోర్నకల్, విజయవాడ - డోర్నకల్, భద్రాచలం - విజయవాడ, విజయవాడ - భద్రాచలం, సికింద్రాబాద్ - వికారాబాద్, వికారాబాద్ - కాచిగూడ, సికింద్రాబాద్ - వరంగల్, వరంగల్ - హైదరాబాద్, సిర్పూర్ టౌన్ - కరీంనగర్, కరీంనగర్ - నిజామాబాద్, కాజీపేట - సిర్పూర్ టౌన్, బల్లార్షా - కాజీపేట, భద్రాచలం - బల్లార్షా, సిర్పూర్ టౌన్ - భద్రాచలం, కాజీపేట - బల్లార్షా, కాచిగూడ - నిజామాబాద్, నిజామాబాద్ - నాందేడ్ ప్రాంతాల మధ్య నడిచే రైళ్ళు ఉన్నాయి. 
 
అలాగే, కాచిగూడ - మహబూబ్ నగర్ మధ్య నడిచే ఎక్స్‌‌ప్రెస్ ఉందానగర్ వరకు, నాందేడ్ - నిజామాబాద్ - పండర్పూర్ ఎక్స్‌ప్రెస్‌ను ముత్కేడ్ వరకు మాత్రమే నడుస్తుందని తెలిపింది. 
 
అదేవిధంగా 22 ఎంఎంటీఎస్ సర్వీసులు కూడా రద్దు చేసింది. వీటిలో లింగంపల్లి - హైదరాబాద్, హైదరాబాద్ - లింగంపల్లి మధ్య నడిచే 10 రైళ్లు, లింగంపల్లి - ఉందానగర్ 3, లింగంపల్లి - ఫలక్ నుమా 2, ఉందానగర్ - లింగంపల్లి 4, ఫలక్ నుమా - లింగంపల్లి 2, రామచంద్రాపురం - ఫలక్ నుమా మధ్య నడిచే ఒక రైలు సర్వీసులు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments