Webdunia - Bharat's app for daily news and videos

Install App

దయచేసి బయటకు రావొద్దు .. కిషన్ రెడ్డి :: ఓయూ పరీక్షలు వాయిదా

Webdunia
బుధవారం, 14 అక్టోబరు 2020 (09:12 IST)
హైదరాబాద్ నగరంరో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. 
 
గత రెండు రోజులుగా హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో నగరం మొత్తం నీట మునిగింది. ఎపుడు వరద నీరు ప్రాంతాలు సైతం ఇపుడు జలదిగ్బంధనంలో చిక్కుకునివున్నాయి. 
 
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నెలకొన్న పరిస్థితులపై మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే, వివిధ ప్రమాదాల్లో అనేక మంది మరణించటం బాధాకరమన్నారు. పిల్లలు, వృద్ధులు ఇళ్ళ నుంచి బయటకు రావొద్దని కోరారు. 
 
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం కేంద్ర బృందాలను, పారామిలిటరీని పంపించటానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు.... అధికారుల సూచనలు పాటించాలన్నారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. 
 
మరోవైపు, తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న అన్ని రకాల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ ఎగ్జామినేషన్స్‌ కంట్రోలర్‌ ప్రొ. శ్రీరాం వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments