ప్రముఖ ఫోటోగ్రాఫర్ భరత్ భూషణ్ కన్నుమూత

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (10:26 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ భరత్ భూషణ్ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన సచివాలయం సమీపంలోని ఒక దవాఖానాలో చికిత్స పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషమించడంతో ఆదివారం అర్థరాత్రి కన్నమూశారు. 
 
హైదరాబాద్ నగరంలోని నల్లకుంటలో నివాసముండే భరత్... సామాజిక స్పృహ కలిగిన ఉత్తమ ఫోటోగ్రాఫర్‌గా పేరుగడించారు. ఆయన ఇంటికి వెళ్లగానే పల్లెటూరి అందాలతో కూడిన ఫోటోలు మనల్ని కట్టిపడేస్తాయి. ఈయన తీసే ప్రతి ఫోటోకు క్యాప్షన్లు పెట్టనక్కర్లేదు. ఎన్నో పల్లె అందాలను తన కెమెరాల్లో బంధించారు. గ్రామీణ నేపథ్యంలో ఎన్నో ఫోటోలను తీశారు. 
 
1970లో ఫోటోగ్రఫీ వృత్తిలోకి అడుగుపెట్టిన ఈయన... ఫోటోగ్రఫీనే తన జీవితంగా మలుచుకున్నారు. పు ఇంగ్లీష్, తెలుగు దినపత్రికల్లో ఫోటోగ్రాఫర్‌గా పని చేశారు. తీరిక సమయాల్లో పెయింటింగ్స్ వేసేవారు. తెలంగాణ రాష్ట్ర తొలి వార్షికోత్సవంలో ఉత్తమ ఫోటోగ్రాఫర్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా సన్మానం అందుకున్నారు. 
 
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు రూ.5 లక్షల నగదు బహుమతిని అందచేశారు. కాగా, ఆయన మృతి పట్ల తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు. అనేకమంది మంత్రులు, రాజకీయ పార్టీల నేతలు తమ సంతాపం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments