తెలంగాణాలో లాక్డౌన్ అమలు ప్రసక్తే లేదు : ఆరోగ్య శాఖ

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (10:44 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీనికితోడు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో మరోమారు లాక్డౌన్ లేదా రాత్రిపూట కర్ఫ్యూను సంక్రాంతి తర్వాత అమలు చేయబోతున్నాంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో లాక్డౌన్ అమలు లేదని స్పష్టం చేశారు. 
 
పైగా సోషల్ మీడియా వేదికగా తప్పుడు అవాస్తవ ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజారోగ్య సంచాలకుడు జి. శ్రీనివాసరావు హెచ్చరించారు. పైగా, జనవరి చివరి వారంలో లాక్డౌన్ అమలు చేయొచ్చని తాను చెప్పినట్టుగా సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. అదేసమంలో ఒమిక్రాన్ వేరియంట్‌తో పాటు.. కరోనా వైరస్‌ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. 
 
మరోవైపు, తెలంగాణా రాష్ట్రంలో కూడా చిన్నారులకు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. రాష్ట్రంలో 15-18 యేళ్ల మధ్య వయసులో 2.78 లక్షల మంది చిన్నారులు ఉండగా, వారికి తొలిరోజున 24240 మందికి వ్యాక్సిన్లు వేసినట్టు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల్లో చిన్నారులకు కోవిడ్ వ్యాక్సినేషన్ సాగుతుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments