Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో ఉద్యోగాలు నిల్, ఆ నలుగురు యువకులు ఏం చేశారంటే?

Webdunia
గురువారం, 16 జులై 2020 (19:46 IST)
ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సాధిద్దామనుకున్నారు. హైదరాబాదు వెళ్లి గ్రూప్ 1, గ్రూప్ 2 కోచింగ్ తీసుకుంటున్నారు. కానీ ఇంతలో కరోనా వాళ్ల ఆశలపై నీళ్ళు చల్లింది. లాక్ డౌన్ కారణంగా వెళ్లిన నలుగురు తిరిగి గ్రామానికి వచ్చారు. ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయాలనుకున్నారు. నలుగురు కలిసి పొట్టేళ్ల పెంపకాన్ని చేపట్టారు. 
 
కరోనా కష్టాన్ని అధిగమించిన జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన నిరుద్యోగులు రాజు, నరసింహులు, శేషన్న, సత్యన్న బాల్య స్నేహితులు. ఒకటో తరగతి నుండి డిగ్రీ వరకు కలిసి చదువుకున్నారు. ఆ తరువాత ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడాలనుకున్నారు కానీ అవకాశము వారిని ఆదరించలేదు.
 
నలుగురు కలిసి గ్రామంలో ఉంటూ ఉపాధి పొందే ఉపాయాన్ని వెతికారు. 7 లక్షల వరకు అప్పు చేసి పొట్టేళ్ళ పెంపకాన్ని ప్రారంభించారు. గ్రామ శివారులో ఒక పెద్ద షెడ్డు వేసుకున్నారు. అప్పటి నుండి కష్టపడి అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనే వారికి వీరు మార్గదర్శకులు. కరోనా కొందరికి కష్టాన్ని నేర్పితే, వీరు చాలామందికి జీవితాన్నే నేర్పుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments