Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో ఉద్యోగాలు నిల్, ఆ నలుగురు యువకులు ఏం చేశారంటే?

Webdunia
గురువారం, 16 జులై 2020 (19:46 IST)
ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సాధిద్దామనుకున్నారు. హైదరాబాదు వెళ్లి గ్రూప్ 1, గ్రూప్ 2 కోచింగ్ తీసుకుంటున్నారు. కానీ ఇంతలో కరోనా వాళ్ల ఆశలపై నీళ్ళు చల్లింది. లాక్ డౌన్ కారణంగా వెళ్లిన నలుగురు తిరిగి గ్రామానికి వచ్చారు. ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయాలనుకున్నారు. నలుగురు కలిసి పొట్టేళ్ల పెంపకాన్ని చేపట్టారు. 
 
కరోనా కష్టాన్ని అధిగమించిన జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన నిరుద్యోగులు రాజు, నరసింహులు, శేషన్న, సత్యన్న బాల్య స్నేహితులు. ఒకటో తరగతి నుండి డిగ్రీ వరకు కలిసి చదువుకున్నారు. ఆ తరువాత ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడాలనుకున్నారు కానీ అవకాశము వారిని ఆదరించలేదు.
 
నలుగురు కలిసి గ్రామంలో ఉంటూ ఉపాధి పొందే ఉపాయాన్ని వెతికారు. 7 లక్షల వరకు అప్పు చేసి పొట్టేళ్ళ పెంపకాన్ని ప్రారంభించారు. గ్రామ శివారులో ఒక పెద్ద షెడ్డు వేసుకున్నారు. అప్పటి నుండి కష్టపడి అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనే వారికి వీరు మార్గదర్శకులు. కరోనా కొందరికి కష్టాన్ని నేర్పితే, వీరు చాలామందికి జీవితాన్నే నేర్పుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments