కరోనాతో ఉద్యోగాలు నిల్, ఆ నలుగురు యువకులు ఏం చేశారంటే?

Webdunia
గురువారం, 16 జులై 2020 (19:46 IST)
ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సాధిద్దామనుకున్నారు. హైదరాబాదు వెళ్లి గ్రూప్ 1, గ్రూప్ 2 కోచింగ్ తీసుకుంటున్నారు. కానీ ఇంతలో కరోనా వాళ్ల ఆశలపై నీళ్ళు చల్లింది. లాక్ డౌన్ కారణంగా వెళ్లిన నలుగురు తిరిగి గ్రామానికి వచ్చారు. ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయాలనుకున్నారు. నలుగురు కలిసి పొట్టేళ్ల పెంపకాన్ని చేపట్టారు. 
 
కరోనా కష్టాన్ని అధిగమించిన జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన నిరుద్యోగులు రాజు, నరసింహులు, శేషన్న, సత్యన్న బాల్య స్నేహితులు. ఒకటో తరగతి నుండి డిగ్రీ వరకు కలిసి చదువుకున్నారు. ఆ తరువాత ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడాలనుకున్నారు కానీ అవకాశము వారిని ఆదరించలేదు.
 
నలుగురు కలిసి గ్రామంలో ఉంటూ ఉపాధి పొందే ఉపాయాన్ని వెతికారు. 7 లక్షల వరకు అప్పు చేసి పొట్టేళ్ళ పెంపకాన్ని ప్రారంభించారు. గ్రామ శివారులో ఒక పెద్ద షెడ్డు వేసుకున్నారు. అప్పటి నుండి కష్టపడి అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనే వారికి వీరు మార్గదర్శకులు. కరోనా కొందరికి కష్టాన్ని నేర్పితే, వీరు చాలామందికి జీవితాన్నే నేర్పుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments