Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో ఉద్యోగాలు నిల్, ఆ నలుగురు యువకులు ఏం చేశారంటే?

Webdunia
గురువారం, 16 జులై 2020 (19:46 IST)
ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సాధిద్దామనుకున్నారు. హైదరాబాదు వెళ్లి గ్రూప్ 1, గ్రూప్ 2 కోచింగ్ తీసుకుంటున్నారు. కానీ ఇంతలో కరోనా వాళ్ల ఆశలపై నీళ్ళు చల్లింది. లాక్ డౌన్ కారణంగా వెళ్లిన నలుగురు తిరిగి గ్రామానికి వచ్చారు. ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయాలనుకున్నారు. నలుగురు కలిసి పొట్టేళ్ల పెంపకాన్ని చేపట్టారు. 
 
కరోనా కష్టాన్ని అధిగమించిన జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన నిరుద్యోగులు రాజు, నరసింహులు, శేషన్న, సత్యన్న బాల్య స్నేహితులు. ఒకటో తరగతి నుండి డిగ్రీ వరకు కలిసి చదువుకున్నారు. ఆ తరువాత ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడాలనుకున్నారు కానీ అవకాశము వారిని ఆదరించలేదు.
 
నలుగురు కలిసి గ్రామంలో ఉంటూ ఉపాధి పొందే ఉపాయాన్ని వెతికారు. 7 లక్షల వరకు అప్పు చేసి పొట్టేళ్ళ పెంపకాన్ని ప్రారంభించారు. గ్రామ శివారులో ఒక పెద్ద షెడ్డు వేసుకున్నారు. అప్పటి నుండి కష్టపడి అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనే వారికి వీరు మార్గదర్శకులు. కరోనా కొందరికి కష్టాన్ని నేర్పితే, వీరు చాలామందికి జీవితాన్నే నేర్పుతున్నారు.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments