Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీసీసీ చీఫ్‌గా ఉన్నంతవరకు బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదు : రేవంత్ రెడ్డి

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (18:24 IST)
తాను తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నంతవరకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పొత్తు ఉండదని టీఎస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. అలాగే, అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెల ముందే అభ్యర్థులను పేర్లను ప్రకటిస్తామని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 80 శాతం ప్రజలు సీఎం కేసీఆర్‌‍ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆయన జోస్యం చెప్పారు. 
 
ఆయన మంగళవారం మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల్లో 80 శాతం మంది ప్రజలు కేసీఆర్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. బీజేపీతో చేయి కలిపి కాంగ్రెస్‌ను లేకుండా చేయాలని కుట్ర పన్నాడని, బీజేపీ ప్రణాళికలను కేసీఆర్ అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలు తమకు 80 సీట్లు ఇవ్వాలని కోరుకుంటున్నామని వెల్లడించారు. 80 సీట్లు కంటే తక్కువ ఇస్తే ప్రజలకే నష్టమన్నారు. 
 
ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ పార్టీకి 25 సీట్ల కంటే తక్కువగానే వస్తాయని తెలిపారు. బీజేపీ సింగిల్ డిజిట్‌కే పరిమితం అని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ ఈసారి కరీంనగర్‌లో పోటీ చేసి గెలవగలరా? అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments