Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడేళ్ల చిన్నారిని చంపేసిన రెండు పాములు... ఎలా?

Webdunia
ఆదివారం, 30 జులై 2023 (11:51 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. రెండు పాములు కలిసి మూడేళ్ల చిన్నారిని చంపేశాయి. దీంతో ఆ చిన్నారి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
జిల్లాలోని నవీపేట మండలం బినోల గ్రామానికి చెందిన మంగలి భూమేశ్‌, హర్షిత దంపతులకు కుమారుడు రుద్రాన్ష్ (రెండున్నర ఏళ్లు), మూడు నెలల కూతురు ఉన్నారు. ఇటీవలి వర్షాలకు వారి ఇంట్లోని ఓ గది కూలిపోయింది. 
 
దీంతో శుక్రవారం తల్లిదండ్రులు వారి పిల్లలతో కలిసి మరో గదిలో నిద్రించారు. అర్థరాత్రి సమయంలో ఇంటి పైనుంచి రెండు పాములు ఒకేసారి మంచంపై నిద్రిస్తున్న రుద్రాన్ష్‌పై పడింది. బాలుడి చేతికి చుట్టుకుని కాటేశాయి. కుమారుడు ఏడవడంతో మేల్కొన్న తల్లిదండ్రులు పాములను లాగి చంపేశారు.
 
ఆ తర్వాత హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించాడు. పాము కాటుకు చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments