Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రెవెన్యూ లోటు రాష్ట్రంగా మారింది.. కేసీఆరే కారణం..?

Webdunia
బుధవారం, 22 నవంబరు 2023 (16:19 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ప్రభుత్వంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మండిపడ్డారు. 2014లో రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ఇప్పుడు రెవెన్యూ లోటు రాష్ట్రంగా మారిందని, దీనికి ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. మల్కాజిగిరి భాజపా అభ్యర్థి ఎన్‌.రాంచంద్రరావు కోసం ఏర్పాటు చేసిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ సభలో ఆమె ప్రసంగిస్తూ.. మరో రెండు, మూడు తరాల్లో తెలంగాణ అప్పులు తీరుతాయని అన్నారు.
 
మద్యం, పెట్రోలు, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, వాటిని జీఎస్టీ పరిధిలోకి తెస్తేనే ధరలు సహేతుకంగా ఉంటాయని ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు. "రాష్ట్రానికి ఎలాగూ పెట్టుబడులు వస్తున్నాయి. రెవెన్యూ మిగులు రాష్ట్రం (2014లో) ఇప్పుడు రెవెన్యూ లోటు రాష్ట్రంగా రూపాంతరం చెందింది. ఆ గౌరవం కేసీఆర్‌కే దక్కుతుంది. నేడు తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. మరో రెండు మూడు తరాల తర్వాత మా పిల్లలు ఆ అప్పులు తీర్చుకోవాల్సి వస్తుంది" అని నిర్మలా సీతారామన్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments