Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసికందును పైనుంచి కిందపడేశారు.. వాళ్లు తల్లిదండ్రులేనా?

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (11:03 IST)
Newborn
సభ్య సమాజం తలదించుకునేలా తల్లిదండ్రులు ప్రవర్తించారు. తల్లిదండ్రులు అనే పేరుకు మాయని మచ్చతెచ్చేలా నడుచుకున్నారు. తాజాగా అలాంటి అమానుష ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కుషాయిగూడలో అప్పుడే పుట్టిన పాపను అపార్ట్‌మెంట్‌పై నుంచి గుర్తు తెలియని వ్యక్తులు పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ పాపను చేరదీసి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 
 
పై నుంచి కిందకి పడివేయడంతో ఆ శిశువు తలకు సిమెంట్ కాంక్రీట్ గుచ్చుకున్నాయి. పసికందును గాయలతో ఉన్న స్థితిలో చూసిన కుషాయిగూడ ఎస్సై సాయికుమార్ చలించిపోయారు. 
 
పాపను తనచేతుల్లోకి తీసుకుని వెంటనే వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 318 (మృతదేహాన్ని రహస్యంగా పారవేయడం ద్వారా పుట్టుకను దాచడం) కింద కేసు నమోదు చేయబడినప్పటికీ, శిశువును విడిచిపెట్టిన తల్లిదండ్రులు లేదా వ్యక్తుల గురించి పోలీసులకు ఇంకా తెలియరాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments