Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీభవన్‌లో వాస్తు దోషం వుందా? రేవంత్ రెడ్డి మార్పులు చేస్తున్నారుగా!

Webdunia
శనివారం, 3 జులై 2021 (21:03 IST)
గాంధీభవన్‌లో వాస్తు దోషం వుందా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. కొత్త పీసీసీ అధ్యక్షుడు గాంధీభవన్‌లో చేస్తున్న మార్పులేంటి..? తెలంగాణ వచ్చాక కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. క్షేత్రస్థాయిలో పార్టీ పట్టుకోల్పోతోంది. గెలిచిన ఒక్కో ఎమ్మెల్యే జారిపోతుండడంతో.. పీసీసీ పెద్దలు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో పడిపోయారు. 
 
దాదాపు ఆరేళ్ల తర్వాత పీసీసీ పగ్గాలు చేతులు మారాయి. తెలంగాణ పీసీసీ బాధ్యతలను రేవంత్‌ రెడ్డి అందిపుచ్చుకున్న తర్వాత గాంధీభవన్‌లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పనిలో పనిగా.. గాంధీభవన్‌ వాస్తులోనూ మార్పులు చేస్తున్నారు. వాస్తు నిపుణుల సూచనల ఆధారంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత పాలకుల సంప్రదాయాలను బద్దలు కొడుతున్నారు.
 
ప్రస్తుతం గాంధీభవన్‌ ఎంట్రన్స్‌ దక్షిణం వైపు ఉంది.. ఇక మీదట తూర్పుద్వారం నుంచి ఎంటర్‌ అవుతారు. దక్షిణ ద్వారం నుంచి ఎగ్జిట్‌ అయ్యేలా మార్పులు చేశారు. అంతేకాదు.. గాంధీభవన్‌ ముందు ఎక్కువ స్పేస్‌ ఉండేలా చూస్తున్నారు. ఇక పీసీసీ అధ్యక్షుడు, వర్కింగ్‌ ప్రెసిడెంట్ల చాంబర్‌లు కూడా మారబోతున్నాయి. పీసీసీ అధ్యక్షుడి చాంబర్‌ తూర్పువైపు తీసుకురాబోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా : మాళవిక మోహనన్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

తర్వాతి కథనం
Show comments