Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీభవన్‌లో వాస్తు దోషం వుందా? రేవంత్ రెడ్డి మార్పులు చేస్తున్నారుగా!

Webdunia
శనివారం, 3 జులై 2021 (21:03 IST)
గాంధీభవన్‌లో వాస్తు దోషం వుందా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. కొత్త పీసీసీ అధ్యక్షుడు గాంధీభవన్‌లో చేస్తున్న మార్పులేంటి..? తెలంగాణ వచ్చాక కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. క్షేత్రస్థాయిలో పార్టీ పట్టుకోల్పోతోంది. గెలిచిన ఒక్కో ఎమ్మెల్యే జారిపోతుండడంతో.. పీసీసీ పెద్దలు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో పడిపోయారు. 
 
దాదాపు ఆరేళ్ల తర్వాత పీసీసీ పగ్గాలు చేతులు మారాయి. తెలంగాణ పీసీసీ బాధ్యతలను రేవంత్‌ రెడ్డి అందిపుచ్చుకున్న తర్వాత గాంధీభవన్‌లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పనిలో పనిగా.. గాంధీభవన్‌ వాస్తులోనూ మార్పులు చేస్తున్నారు. వాస్తు నిపుణుల సూచనల ఆధారంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత పాలకుల సంప్రదాయాలను బద్దలు కొడుతున్నారు.
 
ప్రస్తుతం గాంధీభవన్‌ ఎంట్రన్స్‌ దక్షిణం వైపు ఉంది.. ఇక మీదట తూర్పుద్వారం నుంచి ఎంటర్‌ అవుతారు. దక్షిణ ద్వారం నుంచి ఎగ్జిట్‌ అయ్యేలా మార్పులు చేశారు. అంతేకాదు.. గాంధీభవన్‌ ముందు ఎక్కువ స్పేస్‌ ఉండేలా చూస్తున్నారు. ఇక పీసీసీ అధ్యక్షుడు, వర్కింగ్‌ ప్రెసిడెంట్ల చాంబర్‌లు కూడా మారబోతున్నాయి. పీసీసీ అధ్యక్షుడి చాంబర్‌ తూర్పువైపు తీసుకురాబోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments