Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో భారీగా పెట్టుబడులు: రూ.1000 కోట్లతో కోకాకోలా కంపెనీ

Webdunia
శనివారం, 9 ఏప్రియల్ 2022 (09:17 IST)
ktr
తెలంగాణలో భారీగా పెట్టుబడులు వచ్చాయి. తెలంగాణలో తాజాగా హిందుస్థాన్‌ కోకాకోలా బేవరేజెస్‌ (హెచ్‌సీసీబీ) సంస్థ రూ.1000 కోట్లతో భారీ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. 
 
సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్‌ ఫుడ్‌ప్రాసెసింగ్‌ పార్క్‌లో రెండో మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను నెలకొల్పనుంది ఈ సంస్థ. మొదటి విడుతలో భాగంగా రూ.600 కోట్లను రానున్న రెండేళ్లలో ఖర్చు చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. 
 
ఈ మేరకు గురువారం తాజ్ కృష్ణ హోటల్ లో నిర్వహించిన కార్యక్రమానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో హెచ్‌సీసీబీ రెండో యూనిట్‌ ప్రారంభించనుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ నూతన ఫ్యాక్టరీతో 300 మంది నిరుద్యోగులకు నేరుగా ఉపాధి లభించనుందని వివరించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: బాక్సాఫీస్ విధ్వంసం చేయబోతోన్న వార్ 2 అంటూ కొత్త పోస్టర్

రవితేజకు పితృవియోగం - మెగా బ్రదర్స్ ప్రగాఢ సంతాపం

నెలలు నిండకముందే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments