Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒక్కపూట బడుల సమయాన్ని పెంచిన తెలంగాణ సర్కారు

schools
, గురువారం, 7 ఏప్రియల్ 2022 (09:24 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో ఒక్కపూట బడులు నడుస్తున్నాయి. అయితే, ఈ బడుల సమయాన్ని తొలుత తెలంగాణ ప్రభుత్వం తగ్గించింది. ఈ ఒక్కపూట బడులు ప్రారంభమైనప్పటి నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు స్కూల్స్ నడిచాయి. 
 
ఇపుడు మళ్లీ ఈ సమయాన్ని పెంచారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అంటే గంట సమయాన్ని అదనంగా పెంచారు. ఈ మేరు బుధవారం రాత్రి రాష్ట్ర విద్యా శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ  దీంతో గురువారం నుంచి ఒక్కపూట బడులు మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగనున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు అస్తవ్యస్త పాలన వల్లే విద్యుత్ చార్జీలు పెంచాం : మంత్రి బాలినేని