Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్.షర్మిల... కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయం?

Webdunia
ఆదివారం, 25 జూన్ 2023 (13:41 IST)
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు వైఎస్.షర్మిళ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా తెలుస్తుంది. మరో రెండు రోజుల్లో షర్మిల ఢిల్లీకి వెళ్ళనున్నారని, కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చించనున్నారనే ప్రచారం సాగుతోంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేపీసీసీ చీఫ్, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్వయంగా హైదారాబాద్ నగరానికి వచ్చి షర్మిళను కలిశారు. అప్పటి నుంచే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతూ వచ్చింది. ఈ నేపత్యంలో ఇపుడు చివరి దశ చర్చల కోసం ఆమె ఢిల్లీ వెళుతున్నారనే ప్రచారం సాగుతోంది. 
 
అయితే, ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారా లేక కేవలం పొత్తు మాత్రమే పెట్టుకుంటారా అనేది తేలాల్సివుంది. అయితే, కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడంపై షర్మిళ కొన్ని షరతులు విధించినట్టు ప్రచారం సాగుతోంది. టీపీసీసీలో కీలక బాధ్యతలు అప్పగించాలని, తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని చెప్పినట్టు సమాచారం. 
 
పైగా, తాను కోరినవారి టిక్కెట్లు ఇవ్వాలని ఆమె గట్టిగా పట్టుబట్టినట్టు వార్తలు వస్తున్నాయి. వీటన్నింటికీ అంగీకరిస్తే ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పైగా, ఏపీ రాజకీయాల్లో తాను జోక్యం చేసుకోబోనని, కేవలం తెలంగాణకే పరిమితమవుతానని ఆమె స్పష్టం చేశారు. ఇలా అన్ని విషయాలపై చర్చించేందుకు ఆమె మరో రెండు రోజుల్లో ఢిల్లీకి వెళ్లనున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకరోజు ముందుగానే నవ్వులు పంచనున్న 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం

చిరంజీవికి బ్రిటన్ పౌరసత్వం : వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ

హీరోయిన్లకు వయసు పెరిగితే ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు : జ్యోతిక

జీవితంలో గుడ్ డే, బ్యాడ్ డే రెండూ ఒకే రోజు జరిగాయనేది శివంగి గ్రిప్పింప్

Nani: నాని ప్రెజెంట్ కోర్టు - స్టేట్ vs ఎ నోబడీ గ్లింప్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments