Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్.షర్మిల... కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయం?

Webdunia
ఆదివారం, 25 జూన్ 2023 (13:41 IST)
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు వైఎస్.షర్మిళ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా తెలుస్తుంది. మరో రెండు రోజుల్లో షర్మిల ఢిల్లీకి వెళ్ళనున్నారని, కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చించనున్నారనే ప్రచారం సాగుతోంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేపీసీసీ చీఫ్, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్వయంగా హైదారాబాద్ నగరానికి వచ్చి షర్మిళను కలిశారు. అప్పటి నుంచే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతూ వచ్చింది. ఈ నేపత్యంలో ఇపుడు చివరి దశ చర్చల కోసం ఆమె ఢిల్లీ వెళుతున్నారనే ప్రచారం సాగుతోంది. 
 
అయితే, ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారా లేక కేవలం పొత్తు మాత్రమే పెట్టుకుంటారా అనేది తేలాల్సివుంది. అయితే, కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడంపై షర్మిళ కొన్ని షరతులు విధించినట్టు ప్రచారం సాగుతోంది. టీపీసీసీలో కీలక బాధ్యతలు అప్పగించాలని, తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని చెప్పినట్టు సమాచారం. 
 
పైగా, తాను కోరినవారి టిక్కెట్లు ఇవ్వాలని ఆమె గట్టిగా పట్టుబట్టినట్టు వార్తలు వస్తున్నాయి. వీటన్నింటికీ అంగీకరిస్తే ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పైగా, ఏపీ రాజకీయాల్లో తాను జోక్యం చేసుకోబోనని, కేవలం తెలంగాణకే పరిమితమవుతానని ఆమె స్పష్టం చేశారు. ఇలా అన్ని విషయాలపై చర్చించేందుకు ఆమె మరో రెండు రోజుల్లో ఢిల్లీకి వెళ్లనున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments