Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్ పైన నాయిని, పరామర్శించిన మంత్రి కేటీఆర్

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2020 (22:23 IST)
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హోమ్ మంత్రి నాయిని నర్సింహా రెడ్డిని మంత్రి కేటీఆర్ ప‌రామ‌ర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని మంత్రి ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
 
మెరుగైన వైద్యం అందించాల‌ని డాక్ట‌ర్ల‌ను కోరారు. ప్రభుత్వం తరపున ఎలాంటి సహాయం అవసరం అయినా వెనుకాడవద్దని ఆయన కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. గ‌త నెలలో నాయిని నర్సింహారెడ్డి క‌రోనావైర‌స్ బారిన పడటంతో ఆస్ప‌త్రిలో చికిత్స‌ పొంది కోలుకున్నారు.
 
ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లారు కుటుంబ‌స‌భ్యులు. ఈ క్రమంలోనే నాయినికి ఇటీవ‌ల‌ నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చింది. అయినప్పటికీ ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో పరీక్షించిన వైద్యులు ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు గుర్తించారు. ఆక్సిజన్‌ పడిపోవడంతో అపోలో వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments