హైదరాబాదులో నేషనల్ పేమెంట్ డేటా సెంటర్

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (19:36 IST)
హైదరాబాదు నగరంలో స్మార్ట్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ పేమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది. వివాదాల పరిష్కారానికి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా పేమెంట్ యాఫ్స్ కార్డులు ఇతరత్రా నగదు రహిత లావాదేవీలను నిర్వహించడం వంటివి ఇది చేస్తుంది.
 
ఇండియన్ బ్యాంక్స్ అసోషియేషన్ ఈ సంస్థను 2008లో ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో రూ. 500 కోట్ల  పెట్టుబడితో ఎన్‌పీసీఐ నిర్మించనున్న స్మార్ట్ డేటా సెంటర్‌కు రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసారు. ఎన్‌పీసీఐ ఈ డేటా సెంటర్‌ను అంతర్జాతీయస్థాయి డేటా సెక్యూరిటీ ప్రమాణాలతో డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నిర్మిస్తోంది.
 
ఈ డేటా సెంటర్‌ను నిర్మించేందుకు ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగించారు. భూకంపం, తుఫాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాలకు చెక్కుచెదరకుండా ఉండేటట్లు అత్యంత పటిష్టంగా నిర్మించనున్నారు. ఇది పూర్తయితే దేశంలో అతి పెద్ద డిజిటల్ ఆన్ లైన్ నిర్వహణ కేంద్రంగా హైదరాబాదు మారనున్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments