Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాట నిలబెట్టుకోలేకపోయాను.. అందుకే మిమ్మల్ని వదిలి వెళ్తున్నా...

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (11:32 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఈ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మాట నిలబెట్టుకోలేక పోయానని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ రాసిపెట్టి చనిపోయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణలో బుధవారం ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎంసెట్‌ పరీక్షలను నల్గొండ జిల్లా కనగల్‌ మండలంలోని శాబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన స్నేహా (16) అనే విద్యార్థిని కూడా రాసింది. అయితే, ఈ ఫలితాల్లో ఆమె అర్హత సాధించలేకపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ విద్యార్థిని ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 
 
'అమ్మా.. నాన్న నన్ను క్షమించండి. మీకు నా మొహం చూపించలేను. మీరు నామీద చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ నేను నిలబెట్టుకోలేకపోయాను. అందుకే మిమ్మల్ని వదలి వెళ్తున్నా' అంటూ సూసైడ్ నోట్ రాసింది. కూతురు ఆత్మహత్యతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments