Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాట నిలబెట్టుకోలేకపోయాను.. అందుకే మిమ్మల్ని వదిలి వెళ్తున్నా...

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (11:32 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఈ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మాట నిలబెట్టుకోలేక పోయానని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ రాసిపెట్టి చనిపోయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణలో బుధవారం ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎంసెట్‌ పరీక్షలను నల్గొండ జిల్లా కనగల్‌ మండలంలోని శాబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన స్నేహా (16) అనే విద్యార్థిని కూడా రాసింది. అయితే, ఈ ఫలితాల్లో ఆమె అర్హత సాధించలేకపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ విద్యార్థిని ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 
 
'అమ్మా.. నాన్న నన్ను క్షమించండి. మీకు నా మొహం చూపించలేను. మీరు నామీద చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ నేను నిలబెట్టుకోలేకపోయాను. అందుకే మిమ్మల్ని వదలి వెళ్తున్నా' అంటూ సూసైడ్ నోట్ రాసింది. కూతురు ఆత్మహత్యతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సామాన్య వ్యక్తిలా మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు: జాతీయ మీడియాల్లో వక్ర చర్చలు

నా కథల ఎంపిక వెరైటీ గా ఉంటుంది : రానా దగ్గుబాటి

అమెజాన్ ప్రైమ్స్ లో సస్పెన్స్ థ్రిల్లర్ రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి

విజయ్ దేవరకొండ 12 చిత్రానికి కింగ్‌డమ్ టైటిల్.ఖరారు, యుద్ధం నేపథ్యంగా టీజర్

మెగా ఫ్యామిలీ హీరోలకు 'పుష్పరాజ్' దూరమైనట్టేనా? చెర్రీ అన్‌ఫాలో..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

ప్రేమ మాసాన్ని వేడుక జరుపుకోవడానికి దుబాయ్‌లో రొమాంటిక్ గేట్ వేలు

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

తర్వాతి కథనం
Show comments