Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా నాన్న చనిపోయింది కరోనాతో కాదు, సున్నం రాజయ్య తనయుడు వ్యాఖ్య

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (20:43 IST)
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సీపీఎం సీనియర్ నేత సున్నం రాజయ్య కరోనా బారిన పడి మృతి చెందిన విషయం తెలిసిందే. పార్టీలకు అతీతంగా ఆయన మరణం పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. అయితే ఆయన కుమారుడు విడుదల చేసిన  ఆడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన తండ్రి ఉద్యమాలే ఊపిరిగా బతికారని అందుకే తనకు సీతారామరాజు అని పేరుపెట్టారని తెలిపారు.
 
కరోనా సోకిన తన తండ్రి పట్ల తమ గ్రామంలో వివక్ష చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత మా అక్కకు కరోనా సోకింది. దీంతో తన తండ్రిని గ్రామస్తులు అదోలా చూడటం, ఆయన వస్తున్నపుడు తలుపులు వేయడం చేశారని తెలిపారు. దీంతో ఆయన మానసికంగా కృంగిపోయారని, తర్వాత ఆయనకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలిందని దీంతో ఆయన విపరీతమైన ఒత్తిడికి గురయ్యారని తెలిపారు.
 
ఎన్నో ప్రమాదాలను, రోగాలను చూసిన తన తండ్రికి కరోనా ఒక లెక్కకాదని తెలిపారు. ప్రజల కోసం పరితపించిన తన తండ్రిని ఆ ప్రజలే దూరం చేయడం తట్టుకోలేకపోయారన్నారు. ప్రజలు పలకరించి ధైర్యం చెప్పి ఉంటే ఆయన బ్రతికి ఉండేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా జనాల్లో సరైన అవగాహన కల్పించలేదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments