Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునుగోడు ఉప సమరానికి మోగిన ఎన్నికల నగారా

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2022 (14:44 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉపఎన్నిక జరుగనుంది. ఇందుకోసం భారత ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం వచ్చే నెల మూడో తేదీన ఎన్నికలు జరుగుతాయి. ఆరో తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితానాన్ని వెల్లడిస్తారు. 
 
ఈ ఉప ఎన్నికకు సంబంధించిన 7వ తేదీన అధికారికంగా నోటిఫికేషన్ జారీచేస్తారు. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. 14వ తేదీతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుంది. 15వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తే, 17వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. నవంబరు 3వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఆరో తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతారు. 
 
కాగా, కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. కాగా, ఈ మాజీ ఎమ్మెల్యే ఈ దఫా బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. అలాగే, తెరాస, కాంగ్రెస్ పార్టీలు కూడా బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments