Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన మునుగోడు ఎన్నికల ప్రచారం ... 3 పోలింగ్

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2022 (18:50 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఈ నెల 3వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగనుంది. జరుగనుంది. ఇందుకోసం నిర్వహించిన ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ఈ నెల 3వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఫలితాలను ఈ నెల 6వ తేదీన వెల్లడిస్తారు. 
 
మంగళవారం సరిగ్గా 6 గంటలు కాగానే మునుగోడు ఎన్నికల ప్రచారం ముగిసినట్టుగా ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ఒక్క ప్రాంతంలోనూ ఏ పార్టీకి చెందిన ప్రచారాన్ని అనుమతించరు. ఈ కీలక ఘట్టం ముగియడంతో అన్ని పార్టీల నేతలు గళం మూగబోయింది. 
 
ఇకపోతే ఈ ఉప ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టమైన పోలింగ్ ఈ నెల 3వ తేదీన గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంట వరకు జరుగనుంది. ఈ పోలింగ్ కోసం ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ ఉప ఎన్నికల బరిలో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిసి మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన విషయం తెల్సిందే. వీరి భవితవ్యాన్ని మునుగోడు ఓటర్లు గురువారం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెలలు నిండకముందే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments