ముగిసిన మునుగోడు ఎన్నికల ప్రచారం ... 3 పోలింగ్

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2022 (18:50 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఈ నెల 3వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగనుంది. జరుగనుంది. ఇందుకోసం నిర్వహించిన ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ఈ నెల 3వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఫలితాలను ఈ నెల 6వ తేదీన వెల్లడిస్తారు. 
 
మంగళవారం సరిగ్గా 6 గంటలు కాగానే మునుగోడు ఎన్నికల ప్రచారం ముగిసినట్టుగా ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ఒక్క ప్రాంతంలోనూ ఏ పార్టీకి చెందిన ప్రచారాన్ని అనుమతించరు. ఈ కీలక ఘట్టం ముగియడంతో అన్ని పార్టీల నేతలు గళం మూగబోయింది. 
 
ఇకపోతే ఈ ఉప ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టమైన పోలింగ్ ఈ నెల 3వ తేదీన గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంట వరకు జరుగనుంది. ఈ పోలింగ్ కోసం ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ ఉప ఎన్నికల బరిలో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిసి మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన విషయం తెల్సిందే. వీరి భవితవ్యాన్ని మునుగోడు ఓటర్లు గురువారం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.215 కోట్ల మనీలాండరింగ్ కేసు : అప్రూవర్‌గా మారుతానంటున్న బాలీవుడ్ నటి

Venky: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల ఆదర్శకుటుంబం షూటింగ్ ప్రోగ్రెస్

JD Ckaravarthi: చేతబడి ఐదు భాషల ఆడియో రైట్స్ దక్కించుకున్న సెన్సేషన్ సరిగమ

Thimmarajupalli TV Review : కిరణ్ అబ్బవరం నిర్మించిన తిమ్మరాజుపల్లి టీవీ చిత్రం రివ్యూ

Paapam Pratap Review: పాపం టీవీ విన్, అయ్యో పాపం ప్రతాప్ - పాపం ప్రతాప్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భరించలేని సయాటికా నొప్పి తగ్గేందుకు ఇంటి చిట్కాలు

మెడికవర్ హాస్పిటల్స్‌లో అరుదైన ఘనత: అత్యంత క్లిష్టమైన గుండె, భారీ కణితి శస్త్రచికిత్సలు విజయవంతం

భారతదేశంలో విల్లెరట్ యొక్క గోల్డెన్ హవర్ కలెక్షన్‌ను ఆవిష్కరించిన బ్లాంక్ పెయిన్

Diabetic Kidney Disease, డయాబెటిక్ కిడ్నీ వ్యాధి నిరోధించేందుకు సింపుల్ టిప్స్

మానసిక ఒత్తిడిని తగ్గించే ఆహార పదార్థాలు కూడా వున్నాయా?

తర్వాతి కథనం
Show comments