Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృగశిర కార్తె.. ఈ రోజు చేపలు తినాల్సిందే.. క్యూ కడుతున్న జనం

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (10:07 IST)
తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు చేపల మార్కెట్ వద్ద జనం క్యూ కడుతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఇవాళ 'మృగశిర కార్తె'. ఈ రోజు చేపలు తింటే ఆరోగ్యంగా ఉంటామని ప్రజలు భావిస్తారు. అందుకే ఈ రోజలు చేపలు తింటారు. ఈ రోజు మృగశిర కార్తె కావడంతో తెలుగు రాష్ట్రాల్లో చేపల మార్కెట్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ రామ్ నగర్ చేపల మార్కెట్ అయితే తెల్లవారు జాము నుంచే ప్రజలు బారులు తీరారు. 
 
27 నక్షత్రాల్లోకి ఈ రోజు సూర్యుడి ప్రవేశం జరుగుతుంది. ఇలా జరగడాన్ని 'మృగశిర కార్తె'గా పిలుపుకుంటారు. అంతేకాదు ఈ కార్తె ప్రారంభంలో నైరుతీ రుతుపవనాలు ప్రవేశిస్తాయి. నిన్నటితో రోహిణీ కార్తె ముగిసింది. ఈ రోజు మృగశిర కార్తె ప్రారంభంకావడంతో తొలకరి వర్షాలు కురుస్తాయి. దీంతో రైతులు ఏరువాక లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. నాగళ్లతో పొలాలను దున్ని పంటలు వేస్తారు.
 
ఈ కార్తె సందర్భంగా చేపలు తినడం అనాధిగా వస్తున్న సంప్రదాయం. వేసవి కాలం తర్వాత వాతావరణం చల్లబడుతుంది. వేడిగా ఉండే చేపలను తింటారు. ఇలా చేపలు తినడం వల్ల గుండె జబ్బులు, ఆస్తమా వంటి రోగులు నయం అవుతాయని నమ్మకం. జ్వరం, జలుబు, దగ్గు వంటి రోగాలు కూడా తగ్గుతాయని అంటారు. అందుకే మృగశిర కార్తె రాగానే ప్రజలందరూ చేపలు తినేందుకు మరింత ఆసక్తి చూపుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments