Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీసీసీ చీఫ్ నియామకంపై ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Webdunia
ఆదివారం, 27 జూన్ 2021 (19:07 IST)
తెలంగాణ కాంగ్రెస్ నూతన పీసీసీ చీఫ్ నియామకంపై ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటులా పీసీసీ పదవిన అమ్ముకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పీసీసీ చీఫ్ పదవి కోసం ఇంతకాలం లాబీయింగ్ చేస్తూ ఢిల్లీలో ఉన్న ఆయన.. చివరికి ఆ పదవికి తనకు దక్కకపోవడంతో ఆదివారం నాడు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. పీసీసీ చీఫ్ ఎంపికపై ఎవరూ ఊహించని రీతిలో సంచలన కామెంట్స్ చేశారు.
 
పీసీసీ పదవిని ఇంతకాలం పార్టీని నమ్ముకున్న కార్యకర్తకు ఇస్తారని అనుకున్నానని, కానీ ఓటుకు నోటు లాగా పీసీసీ పదవిని అమ్ముకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌‌చార్జ్ మాణిక్యం ఠాగూర్ డబ్బులు తీసుకొని పీసీసీ పదవిని కట్టబెట్టారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను త్వరలోనే బయటపెడతానని అన్నారు. టి కాంగ్రెస్.. టీటీడీపీ లాగా మారవద్దని ఆకాంక్షిస్తున్నానని కామెంట్స్ చేశారు.  

సంబంధిత వార్తలు

కొత్త సినిమాను చూడాల‌నుకునే ప్రేక్ష‌కులకు బాగా నచ్చే చిత్రం ల‌వ్ మీ :దిల్ రాజు

తెలుగు డిఎమ్‌ఎఫ్‌తో మహేష్ బాబు ఫౌండేషన్ సహకారం

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సారంగదరియా’ నుంచి సాంగ్ రిలీజ్

థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న కాజల్ అగర్వాల్ సత్యభామ

అల్లు అర్జున్ పుష్ప -2 ద రూల్ నుంచి శ్రీ‌వ‌ల్లి పై లిరిక‌ల్ సాంగ్ రాబోతుంది

బెల్లం టీ తాగండి.. పొట్ట చుట్టూ కొవ్వును ఇట్టే కరిగించుకోండి..

కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునే ఆహారం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి..

ఈ ఫుడ్ తింటే 50 ఏళ్లు దాటినా 30 ఏళ్ల వారిలా కనబడుతారు

లింబ్ సాల్వేజ్ సర్జరీని విజయవంతంగా నిర్వహించిన మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

మ్యాంగో జ్యూస్ తాగితే ఇవన్నీ మీ సొంతం

తర్వాతి కథనం
Show comments