Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోకాళ్ల పర్వతం ఎక్కి చంద్రబాబు ఓడిపోవాలని మొక్కుకుంటా.... మోత్కుపల్లి

ఆలేరులో మోత్కుపల్లి ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభ నుండి చంద్రబాబుని ఉతికి ఆరేసారు మోత్కుపల్లి నర్సింహులు. ఆవేశంగా మాట్లాడుతూ చంద్రబాబు చేయని తప్పుకు నన్ను బయటికి పంపారంటూ కంటతడి పెట్టుకున్నారు. అవసరం కోసం వాడుకొని వదిలేసే దాంట్లో చంద్రబాబుని మించినవార

Webdunia
గురువారం, 14 జూన్ 2018 (14:29 IST)
ఆలేరులో మోత్కుపల్లి ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభ నుండి చంద్రబాబుని ఉతికి ఆరేసారు మోత్కుపల్లి నర్సింహులు. ఆవేశంగా మాట్లాడుతూ చంద్రబాబు చేయని తప్పుకు నన్ను బయటికి పంపారంటూ కంటతడి పెట్టుకున్నారు. అవసరం కోసం వాడుకొని వదిలేసే దాంట్లో చంద్రబాబుని మించినవారు ఈ భారతదేశంలో లేడని, జగన్, పవన్ కళ్యాణ్‌లు అసలైన లీడర్లని చంద్రబాబు మోసకారి అని విమర్శించారు.
 
ఎన్టీఆర్‌ని చంపి టీడీపీ జెండాని చంద్రబాబు దొంగిలించాడని తిరిగి ఆ జెండా ఎన్టీఆర్ కుటుంబానికి దక్కాలన్నారు. ఓటుకు నోటుతో టీడీపీ పరువు తీసిన చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు దొంగల్లా దొరికిపోయారని, ఇద్దరికి తగిన శిక్ష పడాలన్నారు. కేసీఆర్‌ని తిట్టమని చెప్పి చంద్రబాబు, కేసీఆర్‌తో కలుస్తాడు... నేను కలిస్తే తప్పా అని ప్రశ్నించారు. 
 
ఎన్టీఆర్ చనిపోయేటప్పుడు చంద్రబాబుని నమ్మవద్దని తనతో చెప్పాడని అయినా వినకుండా తాను మోసపోయానన్నారు. వచ్చే ఎన్నికలలో టిడిపి పార్టీని ఆంద్రప్రదేశ్ ప్రజలు వంద ఫీట్ల బొందలో పెడతారన్నారు. మోకాళ్లు నెప్పులు ఉన్నా తిరుపతి నడచివెళ్లి చంద్రబాబు ఓడిపోవాలని  వెంకటేశ్వరస్వామిని మొక్కుకుంటానని తెలియజేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments